‘వైసీపీ నాయకులు ఏం సాధించారని గడప గడపకీ అంటూ వీధుల్లోకి వస్తున్నారు. అప్పుల పాలై రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అని చెప్పడానికా? పేదల ఇళ్ల పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నామని చెప్పేందుకు వస్తున్నారా? ’ అని జనసేన PAC సభ్యులు పంతం నానాజీ ప్రశ్నించారు. కాకినాడలో శ్రీ ముత్తా శశిధర్ తో సమావేశం నిర్వహించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకొంటుంటే మానవతా దృక్పథంతో స్పందించిన నేత పవన్ కళ్యాణ్ గారనీ అందుకే కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టారన్నారు.YSR చనిపోయినప్పుడు ఓదార్పు పేరుతో శ్రీ జగన్ రెడ్డి చేసిన దాన్ని రాజకీయయాత్ర అంటారని తెలుసుకోవాలి అని వైసీపీ పార్టీని దుయ్యపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa