ఇటీవల కాలంలో పలు నేరాల వెనుక నేపథ్యం వివాహేతర సంబంధాలేనని తేలుతోంది. చాలా మంది వివాహ వ్యవస్థ కంటే వివాహేతర సంబంధాల పట్ల మోజు పెంచుకుంటున్నారు. ఫలితంగా కుటుంబాన్ని రోడ్డు మీదకు చేజేతులా లాక్కుంటున్నారు. ఈ క్రమంలో హత్యలకు పాల్పడుతున్నారు. ఇదే కోవలో ఓ మహిళను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. అయితే హత్యకు పాల్పడింది భర్త, లేక ఆమె ప్రియుడా అనే ఆరా తీసే పనిలో పోలీసులు తలమునకలయ్యారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
కర్నాటకలోని దొడ్డ తాలూకా వడగెరె గ్రామంలో బసవయ్య, భాగ్యశ్రీ (35) అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. భాగ్యశ్రీ దంపతులకు తమ గ్రామానికే చెందిన రియాజ్ (27)అనే వ్యక్తితో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. ఈ క్రమంలో రియాజ్, భాగ్య శ్రీ మధ్య చనువు ఏర్పడింది. అది కాస్త కొన్నాళ్లకు వివాహేతర సంబంధానికి దారి తీసింది. వీరి వ్యవహారం భాగ్యశ్రీ భర్త బసవయ్యకు తెలియడంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. దీంతో తన ప్రియుడు రియాజ్ను భాగ్యశ్రీ కొంత కాలంగా దూరం పెట్టింది. ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారు జామున గుర్తు తెలియని వ్యక్తి వారి ఇంటి తలుపు తట్టాడు. వచ్చింది ఎవరో అని తలుపు తీయగానే భాగ్యశ్రీపై ఆ వ్యక్తి దాడి చేశాడు. ఆమె పిల్లల కళ్ల ముందే కత్తితో పొడిచి భాగ్యశ్రీ ప్రాణాలు తీశాడు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని విచారణ చేపట్టారు. భాగ్యశ్రీ భర్త బసవయ్య ఏదో పెళ్లి ఉందని, వేరే ఊరు వెళ్లాడు. అతడికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తోంది. మరోవైపు మృతురాలి ప్రియుడు రియాజ్ పరారీలో ఉన్నాడు. దీంతో వీరిద్దరిపైనా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారిని పట్టుకునేందుకు ముమ్మరంగా గాలింపు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa