ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఏపీలో బీజేపీకి షాకింగ్ న్యూస్. ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు రాజీనామా చేశారు. గత కొన్ని రోజులుగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తాజాగా ఆయన పార్టీని వీడుతున్నట్లుగా తెలిపారు. వ్యక్తిగత కుటుంబ కారణాల వల్లనే తాను పార్టీ నుంచి వీడుతున్నానని, పార్టీలో కొనసాగలేకపోతున్నానని రావెల కిషోర్ బాబు స్పష్టం చేశారు. తనకు పార్టీలో అవకాశం కల్పించిన బీజేపీ నేతలకు ధన్యవాదాలు తెలిపారు.
2019 ఎన్నికలకు ముందు ఆయన టీడీపీ నుంచి వీడి జనసేనలో చేరారు. ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచే పోటీ చేసి ఓటమిచెందగా ఆ తర్వాత జనసేనకు వీడ్కోలు పలికి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు బీజేపీ పార్టీకి కూడా ఆయన రాజీనామా చేశారు. అయితే త్వరలోనే ఆయన మళ్లీ టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లుగా వార్తలు షికారు చేస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa