రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని మాజీ మంత్రి అమరనాథరెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా మండల కన్వీనర్ దొరబాబు ఆధ్వర్యంలో పూతలపట్టులో సోమవారం రాత్రి చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ స్థాయి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు.
ఆయన మాట్లాడుతూ దళిత మహిళపైనే అధికంగా అత్యాచారాలు జరగడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలవుటద్దమన్నారు. ఎమ్మెల్సీ రాజసింహులు, మాజీ మేయర్ కఠారి హేమలత, తెలుగుమహిళ రాష్ట్ర నాయకురాలు రాజేశ్వరి, చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ తెదేపా ప్రధాన కార్యదర్శి కోదండయాదవ్, నాయకులు చంద్రప్రకాష్ నాయుడు, వెంకటేశ్వర చౌదరి, హిమగిరినాయుడు, చిట్టిబాబు, శివకుమార్, కాంతారావు, మునిరత్నం, మహిళా నాయకులు లక్ష్మీప్రసన్న, లత, సుచిత్ర తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa