నీటి ప్రాధాన్యత ఏమిటో ఢిల్లీ మహానగరంలోని పలు కాలనీలలో నెలకొన్న పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. వేసవి కాలం వచ్చిందంటే ఇప్పటికీ చాలా రాష్ట్రాల్లో నీటి కొరత వేధిస్తుంటుంది. మండే ఎండల్లో నీటి కోసం కోటి పాట్లు పడాల్సి ఉంటుంది. గంటల కొద్దీ నిరీక్షించాలి. వేలకొద్ది కిలోమీటర్ల దూరం వెళ్లి నీళ్లు తెచ్చుకోవాలి. బిందెడు నీళ్లు కోసం వీధుల్లో పోరాటాలు చేయాలి. అంతగా తాగడానికి నీళ్లు లేక.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ప్రస్తుతం ఢిల్లీలో ఇదే పరిస్థితి నెలకొంది. రాజధాని వాసులు నీటి కోసం కటకటలాడుతున్నారు.
ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉంది. ఆయా ప్రాంతాల ప్రజలు నీటి ఎద్దడితో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. దాంతో బోర్లలో నీటిని నింపిన తర్వాత ప్రజలు తమ వాటర్ క్యాన్లను గొలుసులతో కట్టి ఉంచుతున్నారు. ముఖ్యంగా కుసుంపూర్ పహారీ, వసంత్ విహార్లలో ప్రజలు తమ నీటి క్యాన్లను ఎవరూ తీసుకోకుండా గొలుసులు వేసి, వాటిని తాళాలతో లాక్ చేస్తున్నారు. నిజానికి ఆ ప్రాంతాలకు నీటి ట్యాంకర్లు వస్తుంటాయి. అయితే అక్కడున్న కుటుంబాలకు సరిపడనన్ని నీళ్లు అందించడం లేదు. దాంతో అక్కడ ఉన్న ఒక నీటి బోరుపైనే అందరూ ఆధారపడుతున్నారు. ఆ బోరు నుంచి ప్రజలను బకెట్లు, క్యాన్లు తెచ్చుకుని నీళ్లు నింపుకుంటున్నారు.
క్రమంలో ఆ బోరు నీటి విషయంలో చాలాసార్లు ప్రజల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితిలో ప్రజలు తమ డబ్బాలు, బకెట్లను, నీటి క్యాన్లను గొలుసులతో కట్టి ఉంచుతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వేడిగాలుల కారణంగా ఢిల్లీ నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. వజీరాబాద్, చంద్రవాల్, ఓఖ్లా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లలో ఉత్పత్తి సామర్థ్యం మరింత దిగజారడంతో రాజధానిలో నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఢిల్లీ జల్ బోర్డు చెప్పింది. దీంతో ప్రజలు ముందుగానే తగినంత మొత్తంలో నీటిని నిల్వ చేసుకోవాలని అక్కడి అధికారులు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa