ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెళ్లి పీటలపై వరుడికి వధువు దిమ్మతిరిగే షాక్

national |  Suryaa Desk  | Published : Wed, May 18, 2022, 12:30 PM

ఇటీవల కాలంలో అమ్మాయిల అభిరుచులు మారుతున్నాయి. పెద్దల మాటలకు ఏం చెప్పినా తలొంచే రోజులు పోయి, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తమకు ఇష్టం లేని పనులు ఏవైనా చేసేందుకు ససేమిరా అంటున్నారు. ఈ క్రమంలో పెళ్లి వేదిక వద్దకు తాగి వచ్చిన వరుడికి ఓ వధువు కోలుకోలేని షాక్ ఇచ్చింది. అతడిని పెళ్లి చేసుకునేది లేదంటూ భీష్మించింది. చివరికి వారి వివాహానికి వచ్చిన బంధువుల అబ్బాయితో తాళి కట్టించుకుంది. ఎన్నో మలుపులు తిరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.


రాజస్థాన్‌లోని చురు జిల్లా చెలనా గ్రామంలో వరుడు సునీల్‌‌కు ఓ యువతితో మే 15న వివాహం నిశ్చయించారు. ఇరు కుటుంబాలు ఓ పెళ్లి మండపాన్ని బుక్ చేసుకుని, వివాహ వేడుకకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అర్ధరాత్రి 1.15 గంటలకు వివాహ ముహూర్తం పెట్టుకున్నారు. రాత్రి పెళ్లి ఊరేగింపులో వరుడు సునీల్ చాలా ఆలస్యం చేశాడు. స్నేహితులతో కలిసి తప్పతాగి, తూలుతూ వివాహ వేదిక వద్దకు చేరుకున్నాడు. అప్పటికే ముహూర్త సమయం మించి పోయింది. అసహనంతో ఉన్న వధువు తనకు కాబోయే భర్త తాగి తూగడం చూసి ఆగ్రహంతో ఊగిపోయింది. అతడిని పెళ్లి చేసుకోనంటూ తెగేసి చెప్పింది. దీంతో వధువు తల్లిదండ్రులు వివాహానికి వచ్చిన మరో యువకుడితో తమ కుమార్తెకు పెళ్లి జరిపించారు. అయితే తమను అవమానించారంటూ వరుడు సునీల్ కుటుంబికులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వరుడు నిర్లక్ష్యంగా వ్యవహరించాడని, అందుకే పెళ్లి రద్దు చేసుకున్నామని వధువు తరుపు వారు తెలిపారు. పోలీసులు ఇరు పక్షాలకు సర్ది చెప్పి పంపించేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa