గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణం ఇందిరా నగర్ కు చెందిన పల్లపు త్రివేణి (22) అనే యువతి కనిపించడం లేదంటూ ఆమె కుటుంబ సభ్యులు మంగళగిరి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మంగళగిరి పట్టణ పోలీసులు మాట్లాడుతూ ఫోటోలోని త్రివేణీ అనే యువతి 17 వ తేదీ మంగళవారం నుండి కనిపించడం లేదని తెలిపారు. ఆమె చామన ఛాయా రంగు కలిగి, 4. 6 అడుగుల ఎత్తు ఉంటుందని అన్నారు. ఇంటి నుండి వెళ్ళిన సమయంలో పింక్ కలర్ టాప్, బ్లాక్ కలర్ లెగ్గిన్, బ్లాక్ కలర్ చున్ని వేసుకుని ఉందని ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. యువతి ఆచూకీ తెలిసిన వారు మంగళగిరి పట్టణ సీఐ 86888 31354, ఎస్ ఐ 86888 315590 నెంబర్లకు సమాచారం అందజేయాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa