ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నయనానందకరం.. పుష్పయాగం

Bhakthi |  Suryaa Desk  | Published : Thu, May 19, 2022, 09:22 AM

ధర్మవరం పట్టణంలోని లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామికి పుష్పయాగం నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేతుడైన స్వామి రంగురంగుల పూల నడుమ నయనానందకరంగా భక్తుల కు దర్శనమిచ్చారు.


ఉదయం 9గంటలకు ఉభయదారులు అన్నమయ్య సేవా మండలి అభ్యక్షుడు పొరాళ్ల పుల్లయ్య, పొరాళ్ల పద్మావతి దంపతులు కుమారుడు పుండరీకాక్ష, కుమార్తె పూజిత ఇతర కుటుంబస భ్యులతో కలిసి వివిధ రకాల పూలను తెప్పిం చి పుష్పయాగం చేయించారు. అన్నమయ్య సేవాసమితి సభ్యులు అన్నమయ్య సంకీర్తనలను అలపించారు. పద్మశాలీయ సంఘం నాయకులు మహాలక్ష్మి అమ్మవారికి చీరసారే సమర్పించారు. సాయంత్రం 6గంటలకు శయనోత్సవం (ఏకాంతసేవ)తో బ్రహ్మోత్స వాలు ముగిశాయి.


ఈ పూజకార్యక్రమాల్లో ఆలయకమిటీ చైర్మన సుబ్రహ్మణ్యం, పద్మశాలీయ బహూత్తమ సంఘం నాయకులు జక్కా చిన్నశింగరయ్య, రామాంజనేయులు, జింకా చిన్నప్ప, బోడగల శంకర, జింకఅంబరీష్‌, అన్నమయ్య సేవామండలి సభ్యులు గోవిందరాజులు, నాగార్జున, మారుతి, మల్లికార్జున, నరేంద్ర, పోతిరెడ్డి, బాలక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa