ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరద సాయం వెయ్యి కోట్లు మంజూరు

national |  Suryaa Desk  | Published : Thu, May 19, 2022, 09:24 PM

అస్సాంలోని పలు జిల్లాలో కట్టలు తెగిపోయాయి. రోడ్లు, వంతెనలు ధ్వంసమయ్యాయి. దాంతో రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. దీంతో దక్షిణ అసోంకు కనెక్టివిటీని పునరుద్ధరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ చెప్పారు. నిరాశ్రయులైన వారికి ఆహారం అందించే ఏర్పాట్లు చేశామని, ఇప్పటికే డిమా హసావోలో ప్రభుత్వం నాలుగు మెట్రిక్ టన్నుల ఆహారాన్ని విమానం ద్వారా అందజేసినట్టు తెలిపారు. వరద సాయం కింద అసోంకు కేంద్రం రూ.1000 కోట్లు మంజూరు చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం రూ.150 కోట్లు విడుదల చేసిందని సీఎం వెల్లడించారు. కనెక్టివిటీని పునరుద్ధరించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అయితే రైల్వే లింక్‌ను పునరుద్ధరించడానికి 45 రోజులు సమయం పడుతుందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa