ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాలికడుపున తాగాల్సింది టీ..కాఫీలు కాదు..తీసుకోవాల్సింది వీటిని

Health beauty |  Suryaa Desk  | Published : Sat, May 21, 2022, 07:30 PM

కాలికడుపున ఏం తీసుకోవాలి అన్నది కూడా ప్రస్తుతం  ఆలోచించాల్సిన అవసరముంది. చాలామందికి నిద్ర లేవగానే.. కాఫీ, టీ తాగకపోతే.. రోజు మొదలవదు. అవి పొట్టలో పడేవరకు ఏదో పోగొట్టుకున్నట్లే ఉంటారు. ఉదయం లేవగానే.. కాఫీ, టీ పక్కన పెట్టి కొన్ని పదార్థాలు తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఖాళీ కడుపుతో కాఫీ, టీ తాగితే దుష్ప్రభావాలు ఎదురయ్యే సమస్య ఉందని అంటున్నారు. మన బాడీ ఇమ్యూనిటీని బూస్ట్‌ చేసే పదార్థాలు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అంటున్నారు.


ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో చెంచాడు తేనె, సగం చెక్క నిమ్మరసం కలిసి పరగడుపున తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ నీళ్లు తాగితే మలబద్ధకం, ఛాతీ మంట తగ్గుతాయి. తేనెలో క్యాల్షియం, ఐరన్‌, సోడియం, ఫాస్ఫరస్‌, సల్ఫర్‌, పొటాషియం వంటి మినరల్స్‌, సాల్ట్స్‌తో పాటు విటమిన్‌ సి, విటమిన్‌ బి వంటి విటమిన్లు, ప్రొటీన్లు కూడా ఉంటాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు శరీరంలోని హానికారక బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులతో పోరాడడానికి కావాల్సిన శక్తిని శరీరానికి అందిస్తాయి. ఇలా తేనెను రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అధిక బరువు తగ్గుతుంది. ఒక కప్పు హెర్బల్‌టీకి ఒక చెంచా తేనె కలిపి తాగితే శరీరంలోని వ్యర్థాలు బయటకు పోయి చక్కని డిటాక్సిఫికేషన్‌ జరుగుతుంది.


రోజూ ఉదయం తులసి ఆకులను నమలడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఐదు తులసి ఆకులను రాత్రంతా నీటిలో నానబెట్టి.. మరుసటి రోజు ఉదయం పరగడుపునే ఆ ఆకులు తిని. నీటిని తాగాలి. ఇలా చేస్తే దగ్గు, జలుబు లాంటి ఇన్ఫెక్షన్ల నుంచి తక్షణ ఉపమశమనం లభిస్తుంది. తులసి రక్తంలో చక్కెరను కంట్రోల్‌ చేస్తుంది, బీపీని కంట్రోల్‌ చేస్తుంది. తలసి శరీరంలో కొవ్వు పెరగకుండా చూసుకుంది. నిద్ర లేవగానే తులసి, తేనే వేసిన నీరు తాగితే.. శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.


వెల్లుల్లిలో యాంటీ మైక్రోబియల్‌, యాంటీ వైరల్‌ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి జలుబు, దగ్గు లాంటి ఇన్ఫెక్షన్లతో పోరాడేందుకు కావాల్సిన శక్తిని శరీరానికి అందిస్తాయి.వెల్లుల్లి జీర్ణక్రియలో తోడ్పడుతుంది. పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది. అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అలాగే బరువు నియంత్రణలో ఉంచడానికి సూపర్‌గా పని చేస్తుంది. అందుకే వెల్లుల్లిని రోజూ తినే ఆహారంలో భాగం చేసుకోవడంతో పాటు పరగడుపునే వెల్లుల్లిని తీసుకోమంటున్నారు నిపుణులు. ఉదయాన్నే రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలను గోరువెచ్చని నీటితో కలిపి తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వెల్లుల్లిలోని కాంపౌడ్స్‌ కాలేయంలోని విషపదార్థాలను బయటకు పంపుతాయి.


ఉసిరిలో విటమిన్‌-సి అధికంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎంతో తోడ్పడతాయి. ఈక్రమంలో పరగడుపునే దీనిని తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఉసిరి గుజ్జును గోరువెచ్చని నీటిలో కలుపుకొని ఉదయాన్నే తీసుకోవడం ద్వారా వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవచ్చని నిపుణులు అంటున్నారు. ఉసిరిలో చర్మ సౌందర్యం, జుట్టు సంరక్షణకు సంబంధించిన పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఉసిరలో ఎంబ్లికానిన్‌-ఎ, ఎంబ్లికానిన్‌-బి, ప్యునిగ్లుకానన్‌ వంటి పాలీఫినాల్సూ, ఎలాజిక్‌, గాలిక్‌ ఆమ్లం... వంటి ఫ్లేవనాయిడ్లూ పుష్కలంగా ఉంటాయి. కాల్షియం, ఐరన్‌, ఫాస్ఫరస్‌, పొటాషియం.. వంటి మినరల్స్‌ ఉసిరిలో దొరుకుతాయి. దీనిలో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa