అయిల్ ట్యాంకర్, మద్యం ట్యాంకర్ ఏదైనా సరే రవాణ సమయంలో బొల్తా పడితే చాలు జనం వాటిని కొట్టేసేందుకు ఎగబడుతున్నారు. ఈ ఘటనలు పోలీసులకు తలనొప్పిగా మారుతోంది. జనాలను నియంత్రించడం, ట్రాఫిక్ క్లియర్ చేయడం వారికి ఓ పెద్ద సవాల్ గా మారింది. తాజాగా మహారాష్ట్రలో నిత్యం రద్దీగా ఉండే ముంబై అహ్మాదాబాద్ హైవేపై శనివారం ఆయిల్తో నిండిన ఓ ట్యాంకర్ బోల్తా పడింది. దీంతో సుమారు మూడు గంటలపాటు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనలో బోల్తా పడిన ట్యాంకర్ నుంచి వేలాది లీటర్ల నూనె రోడ్డుపాలైంది. ఆ నూనె కోసం స్థానికులు ఎగబడ్డారు. ఎవరికి తోచినంత వారు తీసుకెళ్లారు. నూనెను తీసుకెళ్లెందుకు బిందెలు, క్యాన్లతో పోటీ పడ్డారు.
గుజరాత్లోని సూరత్ నుంచి ముంబైకి ప్రాసెసింగ్ కోసం 12 వేల లీటర్ల ఆయిల్ను తీసుకెళ్తుండగా ఇది జరిగింది. రహదారిపై అదుపుతప్పి ట్యాంకర్ బోల్తాపడింది. దాంతో అందులోని నూనె అంత బయటకు లీక్ అయింది. అది చూసిన గ్రామస్థులు డబ్బాలు, బిందెలతో లీకైన నూనెను తీసుకెళ్లారు. అసలు వంట నూనెల ధర ఆకాశాన్నంటింది. దాంతో నేలపాలవుతున్న నూనెను తీసుకోవడానికి ప్రజలు ఒక్కసారిగా ఎగబడ్డారు. ఎవరికి వీలైనంత వారు ఆయిల్ను తీసుకెళ్లారు. వారిని నియంత్రించండం పోలీసులకు కష్టమైంది. దీంతో దాదాపు మూడు గంటలపాటు రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి.
ఈ ప్రమాదంలో ట్యాంకర్ డ్రైవర్కు స్వల్ప గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. స్థానిక రెస్క్యూ టీం ట్యాంకర్ను రోడ్డుపై నుంచి తొలగించి ట్రాఫిక్ను పునరుద్ధరించామని చెప్పారు. పరిస్థితి అదుపులోకి వచ్చినట్టు తెలిపారు. ఇదిలావుంటే ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో కూడా ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. సింగరాయకొండ మండలం కలికిరాయి సమీపంలోని రహదారిపై బీర్ల లోడుతో ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. దాంతో బీర్లతో ఉండిన లారీ రోడ్డుపై బోల్తా పడింది. దాంతో రోడ్డుపై బీరు బాటిల్స్ పడిపోయాయి. దాంతో స్థానికులు ఒక్కసారిగా బీరు బాటిళ్ల కోసం ఎగబడ్డారు. ఈ ఘటనలో 1275 కేసుల బీరు బాటిల్స్లో కొన్ని పగిలిపోగా.. మరికొన్ని బీరు సీసాలను అక్డకి జనం తీసుకెళ్లిపోయారు. ఈ ప్రమాదంలో దాదాపు రూ.30 లక్షల వరకు నష్టం ఏర్పడినట్టు పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa