రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేలు వాయించుకున్న నీరో చక్రవర్తి చందంగా ఉంది జగన్ రెడ్డి తీరు అంటున్నారు టీడీపీ యువనాయకులు నారా లోకేష్ . పెట్రోల్ ధరలపై ఆయన స్పందిస్తూ.... కేంద్ర ప్రభుత్వం రెండు విడతల్లో పెట్రోల్ డీజిల్ లపై పన్నులు తగ్గించి ఆ మేరకు వాటి ధరలు తగ్గేలా నిర్ణయం తీసుకుంది. కేంద్రంతోపాటు 23 రాష్ట్రాలు కూడా తాము వేస్తోన్న పన్నులని తగ్గించుకుని ప్రజలపై పెట్రోల్, డీజిల్ భారాన్ని తగ్గించి సామాన్యులకు ఊరట కలిగిస్తే, మీ నుంచి స్పందన శూన్యం.టిడిపి హయాంలో ప్రజల పై పెట్రోల్, డీజిల్ ధరల భారాన్ని తగ్గించడానికి రూ.4 వ్యాట్ ని రూ.2కి తగ్గించాం. అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా పెట్రోల్పై వైసిపి సర్కారే 31 శాతం వ్యాట్ విధిస్తున్నారు. దీనికి తోడు అదనపు వ్యాట్ అంటూ లీటర్ పెట్రోల్ఫై 4 రూపాయలు. రోడ్డు సెస్ 1 రూపాయి వేసి దేశంలోనే అతి ఎక్కువగా పెట్రోల్ ధర ఏపీలోనే అమ్ముతూ సామాన్యప్రజల్ని దోచుకుంటున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలోనే అతి ఎక్కువ చేసిన మీ దోపిడీ వల్ల, రవాణారంగంపై ఆధారపడిన అన్నిరంగాలూ తీవ్రనష్టాల్లోకి వెళ్లాయి. పన్నులు రూపంలో పెట్రోల్ డీజిల్పైనా ప్రజల్ని దోచుకోవాలనే మీ దురాశతో నిత్యావసరాలు ధరలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఇప్పటికైనా మానవతా ధృక్పథంతో ప్రజలపై బాదుడే బాదుడుకి స్వస్తి చెప్పాలని కోరుతూ జగన్ రెడ్డి గారికి లేఖ రాసానుఅని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa