ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యార్థులకు ఏదీ భద్రతా: ఢిల్లీ మహిళా కమిషన్ ఆగ్రహం

national |  Suryaa Desk  | Published : Tue, May 24, 2022, 07:18 PM

 


ఢిల్లీ మున్సిపల్ స్కూళ్ల దయనీయ పరిస్థితులపై ఢిల్లీ మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ పాఠశాలలో విద్యార్థులకు ఏదీ భద్రతా అంటూ  ప్రశ్నించింది. ఇదిలావుంటే నిజానికి ఆయా స్కూళ్లలో విద్యార్థినులపై ఇటీవల లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. దాంతో ఢిల్లీ మహిళా కమిషన్ ఆయా స్కూళ్లలో పరిస్థితులపై దర్యాప్తుకు ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ సభ్యులు నాలుగు స్కూల్స్‌కు వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. దాంతో పాఠశాలల్లో దయనీయమైన పరిస్థితులు వెలుగు చూశాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందితో కూడా మాట్లాడి వివరాలు సేకరించారు. ఇందులో భాగంగా పాఠశాలల పరిస్థితిపై ఢిల్లీ మహిళా కమిషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అక్కడి స్కూల్స్‌లో తనిఖీలు చేసిన కమిటీకి ఆశ్చర్యపోయే విషయాలు తెలిశాయి. నాలుగు విద్యా సంస్థల్లో వాడేసిన సిరంజీలు, డ్రగ్స్, ఆల్కహాల్ బాటిళ్లను గుర్తించినట్టు మహిళా కమిషన్ వేసిన కమిటీ వెల్లడించింది. మున్సిపల్ కార్పొరేషన్ ఢిల్లీ ఆధ్వర్యంలో నడిచే పాఠశాలల్లో బాలికల భద్రతపై ఢిల్లీ మహిళా కమిషన్ విచారణ ప్రారంభించింది.


ఈ మేరకు బృంద సభ్యులు పాఠశాలల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. స్కూళ్లు చాలా దయనీయంగా, అసురక్షితంగా ఉన్నట్టు వెల్లడించారు. ఒక్కో పాఠశాలలో గేట్లు కూడా తెరిచే ఉన్నాయని, కొన్ని స్కూల్స్‌లో సెక్యూరిటీ గార్డులు కూడా లేరని కమిటీ వెల్లడించింది. కొన్నిసార్లు తాగుబోతులు పాఠశాలల్లోకి చొరబడి బెదిరించిన సందర్భాలు తమ దృష్టికి వచ్చినట్టు టీమ్ మెంబర్లు చెప్పారు. అలాగే పాఠశాలల ఆవరణలో వాడేసిన సిరంజిలు, గుట్కా కవర్లు, మద్యం బాటిళ్లు కనిపించాయని తెలియజేశారు. దీనిపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సూచించారు. అంతేకాదు పాడైపోయిన, శిథిలావస్థలో ఉన్న భవనాల్లో పాఠాలు చెబుతున్నారని, ఇది పిల్లల భద్రతకు మంచిది కాదని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. అలాంటి భవనాల్లోనే పాఠాల బోధన జరిగితే.. పిల్లలకు ప్రమాదం వాటిళ్లుతుందనే భయాన్ని వ్యక్తం చేశారు.


అలాగే పాఠశాలల్లో సీసీటీవీ కెమెరాలు లేవని కమిటీ సభ్యులు గుర్తించారు. బాత్రూమ్‌లు శుభ్రంగా లేనట్టు, దారుణంగా ఉన్నట్టు గుర్తించారు. అలాగే బాత్రూమ్‌లో ఎటువంటి సబ్బులు లేవని, వాటి తలుపులు కూడా పగిలిపోయి ఉన్నట్టు వెల్లడించారు. వీటితో విద్యార్థుల గోప్యతకు, భద్రతను ప్రశ్నార్థకం అవుతున్నట్టు కమిటీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే పాఠశాలలకు ఉపాధ్యాయులు సమయానికి రావడం లేదని తెలిపారు. కనీసం మూడు క్లాసులకు అటెండ్ కావడం లేదని, ఇంచార్జ్ కూడా గైర్హాజరు అవుతున్నట్టు కమిటీ సభ్యులు గుర్తించారు. అలాగే టీచర్లు.. సాధారణంగా 9 గంటల తర్వాతే వస్తారని విద్యార్థులు చెప్పినట్టు వెల్లడించారు. ఇదిలావుంటే ఈ బృంద సభ్యుల్లో డీసీడబ్ల్యూ చైర్ పర్సన్ స్వాతి మలివాల్, సభ్యులు ప్రమీలా గుప్తా, సరికా చౌదరి, ఫిర్దోస్ ఖాన్, వందనా సింగ్‌లు ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa