కొన్ని సన్నివేశాలు మనకు సినిమాల్లోనే కనిపిస్తాయి. కానీ సోషల్ మీడియా పుణ్యమా అని నిజజీవితంలోనూ ఇలాంటి ఘటనలను మనం చూస్తున్నాం. తాజాగా జార్ఖండ్ రాష్ట్రంలోని సాహిబ్గంజ్ పంచాయతీ ఎన్నికల్లో మూడో విడత పోలింగ్ మే 24న జరగనుంది. మాండ్రో, తల్జారీ, ఉధ్వా బ్లాక్లలో ఈ పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అక్కడి జరిగిన ఓ ప్రచారంపై తాజాగా చర్చ సాగుతోంది. ఎన్నికలంటే ఎక్కడైనా కరపత్రాలు ఇచ్చి ప్రచారం చేస్తారు. బ్యానర్లతో వ్యాన్ల మీద తిరుగుతూ ప్రసంగిస్తుంటారు. ఇంటింటికీ తిరిగి తమ పథకాలు గురించి చెబుతారు. భవిష్యత్తులో చేయబోయే పనులు చెప్పి ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఒక దగ్గర మాత్రం తుపాకులతో ఎన్నికల క్యాంపెయిన్ నిర్వహించారు. పట్టపగలు అందరూ చూస్తుండగా ఒక గుంపు ఆయుధాలను పట్టుకుని ప్రచారం నిర్వహించారు. ఇది జార్ఖండ్లో జరిగింది.
జార్ఖండ్లో సాహిబ్గంజ్లో జిల్లా పరిషత్ ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికోసం అక్కడ కొన్ని రోజుల క్రితం పోటీలో నిలబడిన సునీల్ యాదవ్ అనే అభ్యర్థి ముఫస్సిల్ స్టేషన్ పరిధిలో ప్రచారం చేశారు. ఆ సందర్భంగా కొందరు తుపాకులను పట్టుకుని క్యాంపెయిన్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోని బీజేపీ నేత బాబులాల్ మరాండీ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆ సందర్భంగా ఎన్నికలు ఇలా జరుగుతున్నాయని, ఇలాంటి మాఫియాగిరికి ముగింపు పలకాలంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
దీనిపై జిల్లా ఎస్పీ అనురంజన్ కిస్పోట్టా చర్యలు తీసుకున్నారు. తన దృష్టిలోకి వచ్చిన వెంటనే సునీల్ యాదవ్ అనుచరుల నుంచి ఏడు తుపాకీలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ మేరకు ఇప్పటి వరకు 241 మందిపై వారెంట్ జారీ చేసినట్టు కిస్పోట్ట తెలిపారు. మొత్తం 58 మందిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. అక్రమ ఆయుధాలతో పాటు, పది అక్రమ కాట్రిడ్జ్లను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. అలాగే రూ.9330ల విలువ చేసే అక్రమ మద్యాన్ని కూడా సీజ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa