గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డిని ప్రజలు సమస్యలతో స్వాగతం పలికారు. కలికిరి మండలం, గుట్టపాలెం పంచాయతీ, సి. బరిణేపల్లి, జి. బరిణేపల్లి, గుట్ట పాలెం కస్పాల్లో ఎమ్మెల్యే చింతల, వైసిపి నాయకులు, అధికారులు పర్యటించారు. ఆయన గడప గడపకు వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులను పిలిచి, వాటిని అక్కడికక్కడే పరిష్కరించే ప్రయత్నం చేశారు.
ప్రజలు తమకు జగనన్న ఇళ్లకు సంబంధించిన బిల్లులు రాలేదని, పింఛన్లు కావాలని ఎమ్మెల్యేకు దృష్టికి తెచ్చారు. అలాగే రేషన్ సకాలంలో ఇంటి వద్దకు అందలేదని తెలియజేశారు. ఎంఎల్ఏ వెంటనే స్పందించి ఆ సమస్యల పరిష్కారానికి ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో గుట్టపాలెం గ్రామ సర్పంచ్ రెడ్డి వారి వెంకట్ రెడ్డి, ఎంపిటిసి శ్రీకాంత్, తహశీల్దార్ రమణి, ఎంపిడిఓ వెంకటేశ్వర్లు, పంచాయతీ సెక్రెటరీ గోపి, మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa