హీరోగా సినీ కెరీర్ ని స్టార్ట్ చేసి తర్వాత విలన్గా మారి, ఆపై తిరిగి హీరోగా మారి సూపర్ హిట్లు అందుకున్న నటుడు గోపీచంద్. హీరోగా వరస సక్సెస్ లు అందుకున్న గోపీచంద్ గత కొంతకాలం నుండి పరాజయాలతో బాధపడుతున్నాడు. పరాజయాలకు చెక్ పెట్టి, తిరిగి సక్సెస్ ట్రాక్ లోకి రావాలనుకునే గోపిచంద్ ఆశలన్నీ మారుతీ డైరెక్షన్లో చేస్తున్న పక్కా కమర్షియల్ పైనే. ఇందులో రాశీఖన్నా హీరోయిన్. ఎప్పుడో స్టార్ట్ ఐన ఈ సినిమా పలు కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. ఇటీవలే జులై 1వ తేదీన సినిమాను విడుదల చేయబోతున్నామంటూ చిత్రబృందం ప్రకటించింది.
తాజాగా ఈ మూవీ నుండి ఒక అప్డేట్ వచ్చింది. మూవీ నుండి సెకండ్ లిరికల్ సాంగ్ "అందాల రాక్షసి" ని జూన్ 1వ తేదీన విడుదల చెయ్యబోతున్నట్టు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ మేరకు పాటకు సంబంధించిన ఒక స్పెషల్ పోస్టర్ను కూడా విడుదల చేసారు. ఇందులో హీరోహీరోయిన్లు ఇద్దరు కలర్ ఫుల్ డ్రెస్సుల్లో పార్టీ లైట్స్ లో ఉన్నారు. గోపీచంద్, రాశీఖన్నా ల మధ్య సాగే డ్యూయెట్ సాంగుగా ఈ పాట ఉండనుందని అర్ధమవుతుంది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa