పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలతోపాటు ఆర్టీసీ బస్సు చార్జీలు, ఇంటిపన్నులు తగ్గించాలని, కొత్తగా అమలుచేస్తున్న చెత్త పన్నును ఎత్తి వేయాలని సీపీఎం, సీపీఐ జిల్లా కమిటీ సభ్యులు కే. హనుమంత రెడ్డి, బుదాల శ్రీను లు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 30న కలెక్టర్ కార్యాలయాలవద్ద ధర్నాలకు పిలుపు ఇవ్వడం జరిగిందని చెప్పారు. అందులో భాగంగా గత నాలుగు రోజులుగా పట్టణంలోని పెట్రోల్ బ్యాంకులవద్ద, ఆర్టీసీ బస్టాండ్, విద్యుత్ స్టేషన్ వద్ద ధరలకు పెరుగుదలకు నిరసన తెలియచేసి, ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగా ఇంటి పన్నుల పెంపుపై నిరసన తెలియ చేస్తున్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa