వైకాపా చేపట్టిన సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర శనివారం మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి కనకదుర్గమ్మ వారధి వద్ద గుంటూరు జిల్లాలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా బస్సుయాత్రకు రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్సీ హనుమంతరావు, ఎమ్మెల్యే ఆర్కే, మోదుగుల వేణుగోపాల రెడ్డి, ఎంపీ నందిగామ సురేష్, కిలారి వెంకట రోశయ్య తదితరులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రతిపక్షాలు చేసే తప్పడు ప్రచారాలకు స్వస్తి పలకాలని అన్నారు.
బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఒకవైపు నిలబడివుందని, మేదావులు చట్టాలు చేసినా రాజ్యాంగం రచించినా వాటి పలితాలు అట్టడుగు బలహీన వర్గాల వారికి పూర్తి స్థాయిలో నేటికీ అందటంలేదని అన్నారు. సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా కూడా వారందరిని పైకి తీసుకురావాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలలో 56 శాతం మందికి మంత్రి వర్గం లో స్థానం కల్పించగా దానిని నేడు 70 శాతానికి పెంచిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి కె దక్కుతుందన్నారు. మంగళగిరి నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చి బస్సు యాత్రలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ మంత్రులకు స్వాగతం పలికి సామాజిక న్యాయ భేరి బస్సుయాత్రను జయప్రదం చేశారు. కనకదుర్గమ్మ వారధి (మణిపాల్ హాస్పిటల్) వద్ద నుండి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వరకు బైకులతో, కార్లతో ర్యాలీగా బస్సు యాత్ర యూనివర్సిటీ కి చేరింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa