శనివారం కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రుతుక్రమ పరిశుభ్రత దినోత్సవం పురస్కరించుకొని రుతుక్రమం సమయంలో వాడే ఉత్పత్తులు, వాటిని పారవేసే పద్ధతిపై జిల్లా కలెక్టర్ గిరీషా, జాయింట్ కలెక్టర్ తమీమ్ అన్సారియాలు యునిసెఫ్ రూపొందించిన పోస్టర్ లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గిరీషా మాట్లాడుతూ కౌమారదశలో చేరిన సమయంలో శారీరకంగా వారిలో కలిగే మార్పుల అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలు, వారికి ఆ సమయంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకునేలా సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలోని బాలికలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని ఐసిడిఎస్ పీడీను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
అనంతరం ఐసిడిఎస్ పిడి పద్మజా మాట్లాడుతూ రుతుక్రమం సమయంలో విశ్రాంతి, ఆహారం చాలా అవసరం. పండ్లు, కూరగాయలు, పప్పులు, పాల ఉత్పత్తులు మొదలైనవి సమృద్ధిగా ఉన్న సమతుల్య ఆహారం తీసుకోవాలన్నారు. దీనివల్ల శరీరంలో రక్తహీనతను నివారించగలమన్నారు. రోజువారి స్నానం, వ్యక్తిగత పరిశుభ్రత, సానిటరీ నాప్కిన్ ల వాడకంపై ప్రతి పంచాయతీలలో కౌమార బాలికల అందరికీ అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ పోస్టల్ ఆవిష్కరణలో ఐసీడీఎస్ పీడీ పద్మజ, హౌసింగ్ పిడి శివయ్య, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa