జిల్లాలో సగటు వేతనం రూ 245 నుండి 255 వరకు ఉండేవిధంగా పనులు చేపట్టాలని ఉపాధి హామీ పథకం సంచాలకులు పి. చినతాతయ్య సిబ్బందికి ఆదేశించారు. శనివారం జిల్లా నీటి యాజమాన్య సంస్థ కార్యాలయంలో ఏపీవోలు, ఏపీడిలు, ఈసీలు, ఇతర సిబ్బందితో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సగటు వేతనం తగ్గినట్లయితే జిల్లాలో సిబ్బంది వేతనాలు పొందే అవకాశం కూడా ఉండదని, ఈ విషయాన్ని గ్రహించాలన్నారు. మండలాల వారీగా నిర్దేశించిన పని జనాల లక్ష్యాలను అధిగమించడంతో పాటు సగటు వేతనం పెంచడం ద్వారా మెటీరియల్ పనుల నిధులు కూడా జిల్లాకు ఎక్కువగా మంజూరు అవుతాయని ఆయన అన్నారు. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. గ్రామస్థాయిలో జాబ్ కార్డులు ఉన్న వారందరికీ పని దినాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరిగెత్తే నీటిని నిల్వ చేయడం, భూమిలోకి ఇంకే విధంగా పనూలు చేయడం ద్వారా భూగర్భ జలాలను పెంపొందించాలన్నారు. ప్రతి ఉద్యోగి విధులను భారంగా కాకుండా బాధ్యతగా భావించాలని కోరారు. లక్ష్యాల సాధనకు ఏపీడిలు నిరంతరం పర్యవేక్షించాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa