ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాహనచోదకులకు తప్పని కష్టాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 28, 2022, 08:12 PM

చింతపల్లి మండలంలోని గొందిపాకలు నుండి ఎర్రవరం గ్రామానికి వెళ్లే రహదారి ఇటీవల కురుస్తున్న అకాల వర్షాల కారణంగా బురదతో చిత్తడిగా మారింది. ఈ మార్గంలో రాకపోకలకు ద్విచక్ర వాహనదారులు ప్రయాణికులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. ఈ మధ్య కాలంలో మట్టి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టి అర్ధాంతరంగా విడిచి పెట్టడంతో వాహనచోదకులకు కష్టాలు తప్పడం లేదు. అధికారులు సత్వరమే రోడ్డు నిర్మాణం పూర్తి చేసి ప్రమాదాలను నివారించాలని ప్రజలు కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa