బాలికలకు, మహిళలకు నెలవారీ రుతుక్రమం సర్వసాధారణమేనని శృంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారిణి శృతి తెలిపారు. శనివారం కొత్తవలస ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాదికారిణి శ్రృతి ఆధ్వర్యంలో వైద్య సిబ్బందితో కొత్తవలస మండల కేంద్రంలో రుతుక్రమం పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శృతి మాట్లాడుతూ.
కిశోర బాలికలకు అలాగే మహిళలకు నెలవారీ రుతుక్రమం సర్వసాధారణమేనని అన్నారు. రుతుక్రమం సమయంలో మహిళలు పరిశుభ్రతను పాటించాలని కోరారు. రుతుక్రమం సమయంలో మహిళలు బట్టగుడ్డను వాడకుండా నేప్ కీన్లను వాడాలని సూచించారు. ప్రతి నాలుగు గంటలకు ఒకసారి నేప్ కీన్లల్ను మార్చుకోవాలని తెలిపారు. అలాగే శరీర శుభ్రతను పాటించాలని తెలిపారు.
మహిళలు బహిష్టు సమయంలో సరైన పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. రుతుక్రమం సమయంలో బాలికలు అలాగే మహిళలు చేతులను శుభ్రపరచుకోవాలని, లేకుంటే ఇన్ఫెక్షన్ బారిన పడే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రస్తుతం అన్ని పాఠశాలల్లో 7వ తరగతి నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థినిలకు వైయస్సార్ స్వచ్ఛ కార్యక్రమం కింద ఉచితంగా నేప్ కీన్లను అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో మండలానికి చెందిన ఏఎన్ఎంలు తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa