ఏదైనా ప్రమాదపూరిత ఘటన జరిగినపుడు మనం ఎక్కువగా ఆందోళనకు గురై ప్రాణాలను పోగొట్టుకొంటాం. కానీ ఏలాంటి పరిస్థితుల్లోనైనా సరే సమయస్పూర్తితో వ్యవహరించి ప్రాణాలను దక్కించుకోవచ్చు. ఇతరుల ప్రాణాలను కాపాడవచ్చు. అమెరికాలోని టెక్సాస్ లో జరిగిన కాల్పుల సమయంలో ఓ చిన్నారి ఎంతో సమయస్పూర్తితో వ్యవహరించి ప్రాణాలను కాపడుకొంది.
మూడు రోజుల క్రితం అమెరికాలోని టెక్సాస్లోని పాఠశాలలో దుండగుడు జరిపిన కాల్పులకు చాలా మంది పిల్లలు మృతి చెందారు. ఓ వ్యక్తి లోపలకు ప్రవేశించి పాఠాలు వింటున్న పిల్లలను కాల్చేశాడు. ఈ విషాద ఘటనలో 19 మంది విద్యార్థులతో పాటు మొత్తం 21 మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ ఆ దాడి నుంచి ఓ అమ్మాయి చాలా తెలివిగా తప్పించుకుంది. మియా సెర్రిల్లో (11) దుండగుడు జరిపిన కాల్పులకు తూటాలు తగిలి పిల్లలు రక్తపు మడుగులో పడిపోవడాన్ని చూసి భయపడిపోయింది. ఇక తన వంతే అనుకున్న సమయానికి మియా సెర్రిల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించింది. దాంతో ఆ పాప ప్రాణాలతో సురక్షితంగా బయటపడింది.
మియా సెర్రిల్లో రాబ్ ఎలిమెంట్రీ స్కూల్లో నాలుగో తరగతి చదువుకుంటుంది. ప్రతిరోజూ లాగానే మంగళవారం కూడా పాఠశాలకు వెళ్లింది. క్లాస్లో శ్రద్ధగా పాటాలు వింటోంది. ఆ టైంలో ఓ దుండుగుడు తుపాకీతో ప్రవేశించి.. కాల్పులు ప్రారంభించాడు. దాంతో మియా చుట్టూ ఉన్న వారంతా తుపాకీ తూటాలకు బలై కింద పడిపోతున్నారు. అది చూసిన మియా తను చనిపోవడం ఖాయమనుకుంది. అంతలోనే మియా మెదడులో అద్భుతమైన ఆలోచన వచ్చింది. వెంటనే పక్కనే స్నేహితుల మృతదేహాల నుంచి కారుతున్న రక్తాన్ని చేతులకు, శరీరానికి రాసుకుంది. కింద పడుకుని శవంలా నటించింది. కొద్దిసేపు ఊపిరి బిగబెట్టుకుంది. దుండుగులు మియాను చూసి చనిపోయిందనుకుని వెళ్లిపోయాడు.
ఆ కాల్పులు జరిపిన వ్యక్తి అక్కడ నుంచి వెళ్లిపోయిన వెంటనే చనిపోయిన టీచర్ చేతిలోని ఫోన్ తీసుకుని 911 ఎమర్జెన్సీ నెంబర్కు ఫోన్ చేసి.. విషయం వెల్లడించింది. అక్కడకు చేరుకున్న పోలీసులు స్వల్ప గాయాలపాలైన మియాను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అలా మియా ఆ ప్రమాదం నుంచి బయటపడింది. కానీ ఆ కాల్పుల ఘటన తనను వెంటాడుతూనే ఉందని మియా తండ్రి మిగుల్ సెరిల్లో చెప్పారు. రాత్రంతా పడుకోలేదని, వణికిపోతూ కూర్చొందని చెప్పారు. చాకచక్యంగా తప్పించుకున్న మియా తెలివిని అందరూ మెచ్చుకుంటున్నారు.
ఇదిలావుంటే 19 మంది పొట్టన పెట్టుకున్న సాల్వడోర్ రామోస్ను (18) పోలీసులు మట్టుబెట్టారు. అయితే ఇలాంటి కాల్పుల ఘటనలకు అడ్డుకట్ట వేయడంలో ఘోరం విఫలమైందని బైడన్ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై అందరూ విమర్శిస్తున్నారు. చనిపోయిన పిల్లలను చూసి ప్రతి ఒక్కరూ కదిలిపోతున్నారు. అమెరికాలో నానాటికి గన్ కల్చర్ పెరిగిపోతుంది. దాంతో చాలామంది అమాయకులు పసివాళ్లు బలైపోతున్నారు. ఎవర ో ఒకరు చేతుల్లో ఆయుధాలను పట్టుకుని.. కాల్పులు జరుపుతూనే ఉన్నారు. అమెరికాలోని పలు ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు సాధారణం అయిపోయాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa