పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నాయకుడు సిద్ధూ మూసేవాలా దారుణ హత్యకు గురైన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో పోస్ట్ మార్ట్ం రిపోర్ట్ పై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఆయనను అంత కసిగా ఎందుకు చంపారు అన్నది ఇపుడు రాజకీయ వర్గాల్లో సాగుతున్న చర్చ. ఇదిలావుంటే మాన్సా జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం సిద్దూపై కాల్పులు జరిపారు. అయితే ఆయన అటాప్సీ రిపోర్ట్లో అబ్బురపరిచే విషయాలు తెలిశాయి. అతని శరీరంపై 24 బుల్లెట్ గాయాలున్నట్టు తెలిసింది. సిద్ధూపై రెండు నిమిషాల వ్యవధిలో 30 రౌండ్లు కాల్పులు జరిపినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. పోస్టుమార్టం అనంతరం సిద్దూ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
మాన్సా జిల్లాలో మంగళవారం సిద్ధూ అంత్యక్రియలను నిర్వహించారు. ఈ మేరకు పలువురు ప్రముఖులు ఆయన నివాసానికి వెళ్లి సంతాపం తెలియజేశారు. సిద్ధూను కడసారి చూడడ్డానికి పెద్ద ఎత్తున యువత, అభిమానులు ఆయన ఇంటికి చేరుకున్నారు. చాలామంది ఆయనకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఆయన అంతిమ యాత్రలో పెద్దఎత్తున ప్రజలు పాల్గొన్నారు. తమ ప్రియతమ గాయకుడికి కన్నీటి వీడ్కోలు పలికారు. సిద్ధూ ఇంటి వెలుపల భారీ పోలీసు బలగాలను మోహరించారు.
అయితే ప్రభుత్వం అతని భద్రతను తొలగించిన 24 గంటల్లోపే మాన్సాలోని అతని పూర్వీకుల గ్రామానికి సమీపంలో సిద్ధూపై కాల్పులు జరిగాయి. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఈ దారుణ హత్యపై విచారణకు హైకోర్టు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో జ్యుడీషియల్ కమిషన్ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.
సిద్ధూ మూసేవాలా మహేంద్ర థార్ బండిలో వెళ్తున్న సమయంలో సుమారు పది మంది చుట్టిముట్టి ఆయనపై కాల్పులు జరిపారు. సంఘటనా స్థలం నుంచి సేకరించిన బుల్లెట్ షెల్స్తో దుండగులు ఏకే 47 రైఫిల్ను వాడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. దీని వెనుక కెనడా గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్, లారెన్స్ బిష్ణోయ్ ఉన్నట్టు భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa