తిరుమలలో కొందరు సిబ్బంది కారణంగా ఓ వివాదం మొదలైంది. దీంతో భక్తులు ఆందోళనకు దిగారు. అధికార్లు సర్థిచెప్పడంతో వివాదం ముగిసింది. వివరాలోకి వెళితే.. తిరుమలలో భక్తుల లగేజీ వ్యవహారంపై ఆందోళనకు దారితీసింది. తిరుమల శ్రీవారి మెట్టు ప్రాంతంలో ఉన్న లగేజ్ సెంటర్ దగ్గర నడక భక్తులు ఆందోళనకు దిగారు. తాము ఉదయం 9.30 గంటలకు చంద్రగిరి శ్రీవారి మెట్టు వద్ద లగేజ్ ఇచ్చి తిరుమలకు వచ్చామని సాయంత్రం 5 కావస్తున్నా తమ లగేజ్ ఇవ్వలేదంటూ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. లగేజీ గురించి అడిగితే తమకు తెలియదు నంబర్ ఇస్తాం మీరే మాట్లాడుకోండి అని సిబ్బంది సమాధానం ఇస్తున్నారని భక్తులు చెబుతున్నారు. లగేజీ కౌంటర్లో సిబ్బంది తీరు సరిగా లేదు అధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలంటూ భక్తులు డిమాండ్ చేశారు. టీటీడీ విజిలెన్స్ సిబ్బంది మాత్రం తిరుమలకు యథావిధిగా బ్యాగులు వస్తున్నాయని.. కొందరి బ్యాగులే కనిపించడం లేదంటున్నారు.
ఈ సమాచారం అందుకున్న టీటీడీ నిఘా, భద్రతా విభాగం అధికారులు.. పోలీసులు ఎంబీసీ లగేజీ కౌంటర్ దగ్గర భక్తులకు సర్దిచెప్పారు భక్తుల లగేజీ ఇప్పిస్తామన్నారు. బ్యాగులు రాక దర్శనానికి వెళ్లలేని భక్తుల వివరాలను సేకరించి, వారికి ప్రత్యేకంగా స్లిప్లు ఇచ్చారు. వీటి ద్వారా దర్శనానికి పంపిస్తామని హామీ ఇచ్చారు. భక్తుల బ్యాగులను తరలించే సమయంలో కొన్నింటిని పక్కన పెట్టడంతో సమస్య వచ్చినట్లు చెబుతున్నారు. భక్తులు బ్యాగుల్లోనే దర్శన టికెట్లు, రైలు టికెట్లు, స్వామివారి ముడుపులు ఉన్నాయని చెబుతున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఇవాళ 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. బుధవారం తిరుమల శ్రీవారిని 71,914 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న స్వామివారికి 37,234 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.39 కోట్లు వచ్చినట్టు టీటీడీ తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa