పర్యావరణానికి ప్లాస్టిక్ వాడకం పెనుభూతంగా తయారయిందని ప్లాస్టిక్ వాడకం నిషేధిద్దామని శుక్రవారం చినదొడ్డిగల్లు శాఖాగ్రంధాలయంలో అవగాహన కార్యక్రమం గ్రంధాలయాధికారి కె. జనార్దన్ ఆధ్వర్యంలో నక్కపల్లి హైస్కూల్ తెలుగు ఉపాధ్యాయుడు ఎన్. వి. ఎస్. ఆచార్యులు పర్యవేక్షణలో నిర్వహించారు. వేసవిశిబిరంలో భాగంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ముందుగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆచార్యులు మాట్లాడుతూ మన దైనందిన జీవితంలో పాలు, పెరుగు, కూరగాయలు, టీ, టిఫిన్, భోజనం ఏది కావాలన్నా ప్లాస్టిక్ కవర్లు ఎక్కువగా వాడుతున్నామని, ప్లాస్టిక్ లేనిదే ఏ సరుకులు తెచ్చుకోలేకపోతున్నామని, కానీ వాటిని ఉపయోగించడంవలన కలిగే నష్టాలను తెలుసుకోలేకపోతున్నామన్నారు. ప్లాస్టిక్ ను తగలబెడితే దానినుండి వెలువడే ట్యాక్సిన్స్ ప్రమాదహేతువులని అన్నారు. పాలీధీన్ కవర్లు భూమిలో కలవడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుందని, వాటిని వాడడంవలన అతి ప్రమాదకరమైన క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడతారని , ప్లాస్టిక్ వాడకం నిషేధించి వాటికి ప్రత్యామ్నాయం గా త్వరగా మట్టిలో కలిసిపోయే వెదురు, కాగితపు కవర్లు, బుట్టలు, బుట్ట సంచులు వంటి ప్రకృతి సహజమైన వాటినే ఉపయోగించేలా ప్రయత్నిద్దామని ఆచార్యులు తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa