జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్కు రాబోయే ఎన్నికలపై ఇంకా క్లారిటీ లేదని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. పొత్తులపై మూడు ఆప్షన్లు ఉన్నాయని పవన్ కల్యాణ్ చెప్పడాన్ని అంబటి తప్పుబట్టారు. ‘చంద్రబాబును సీఎం చేయడమే పవన్ ధ్యేయమా?, ఎవరిదో పల్లకి మోయడానికి ఆప్షన్లు ఎందుకు?, తన ఆశయం ఏంటో అభిమానులకైనా పవన్ చెప్పాలి? బీజేపీతో పవన్ ఉన్నాడా.. లేడా? అని అంబటి ప్రశ్నించారు. కనీసం అభిమానులకైనా పవన్ ఆశయం ఏమిటో చెబితే బాగుంటుందని అంబటి ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటుందని ఆయన తెలిపారు. సాధ్యమైనంత త్వరలో పోలవరంను పూర్తి చేస్తామన్నారు. తాము చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని, పోలవరంను పూర్తి చేసి తీరుతామని అంబటి అన్నారు. ‘పోలవరం ప్రాజెక్టు దశల వారీగా పూర్తవుతుంది.సీఎం జగన్ చిత్తశుద్ధితో పాలన చేస్తున్నారు. దుష్టచతుష్టయం కుట్రలు చేస్తున్నాయి. ప్రభుత్వంపై బురదజల్లాలని ప్రతిపక్షం ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వంపై 60 శాతం మందికి పైగా ప్రజలు సంతృప్తిగా ఉన్నారు అని ధీమా వ్యక్త పరిచారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa