ఎక్కడ సమస్య వచ్చినా గుర్తొచ్చే నాయకుడు పవన్ కళ్యాణ్ అని జనసేన నేత నాగబాబు పేర్కొన్నారు. నాయకులు పని చేయకపోతే చేయి మెలిపెట్టి ప్రశ్నించే స్థాయికి జనసేన కేడర్ ఎదిగిందని ఆయన చెప్పారు. ఉత్తరాంధ్రలో లీడర్ షిప్ సమస్య ఉందని అయితే, అక్రమ మైనింగ్, ఇసుక తవ్వకాలపై జనసైనికులు పోరాట ప్రతిమ అమోఘమన్నారు. జనసేనకు తానేం చేస్తున్నాననేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలని పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ నిప్పుల్లో దూకమంటే దూకాలని.. అలాంటి కార్యకర్తలు అవసరమన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు వింటే 2024లో ఆయననే ముఖ్యమంత్రిగా చూడొచ్చని పార్టీ పీఏసీ సభ్యుడు, మెగా బ్రదర్ నాగబాబు ధీమా వ్యక్తం చేశారు. మంగళగిరిలో జరిగిన జనసేన విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న నాగబాబు.. ఏపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఎక్కడికెళ్తే అక్కడ సమస్యలు తీరుతాయన్న నమ్మకం ఏర్పడిందన్నారు. అయితే, ఉత్తరాంధ్రలో సమస్య వస్తే పవన్ కళ్యాణ్ అవసరం లేదు జన సైనికులు వస్తే చాలనేంతలా నమ్మకం ఏర్పడిందన్నారు.
మరోవైపు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్పై నాగబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. విశాఖపట్నం రుషి కొండ వ్యూ చాలా అద్భుతమైనదని.. అలాంటి కొండను కొట్టేస్తుంటే ప్రతిఘటించింది జనసేన పార్టీయేనని తెలిపారు. అవంతి శ్రీనివాస్ ఎర్ర కొండలు తినేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ పాటికే ఒక కొండ తినేసి ఉండుంటారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa