ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భూ స‌మ‌గ్ర స‌ర్వే కార్య‌క్ర‌మాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకోవాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 06, 2022, 03:16 PM

వైయస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు - భూ రక్ష పథకంపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా సమగ్ర సర్వే వివరాలను అధికారులు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు వివ‌రించారు.ఈ సందర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడుతూ.. సమగ్ర సర్వేతో అన్ని భూ వివాదాలు పరిష్కారం అవుతాయ‌న్నారు. దశాబ్దాల తరబడి నెలకొన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంద‌న్నారు. భూ వివాదాలను పరిష్కరించడం అన్నది సమగ్ర సర్వే ప్రధాన లక్ష్యాల్లో ఒకటి అని చెప్పారు. సమగ్ర సర్వేను నిర్దేశించుకున్న సమయంలోగా పూర్తిచేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అవసరమైన సిబ్బందిని సమకూర్చుకోవాలని, సాంకేతిక పరికరాలను అవసరాలకు అనుగుణంగా తెప్పించుకోవాలని సూచించారు. డ్రోన్లు, ఓఆర్‌ఐ పరికరాలు, రోవర్లు, అలాగే సర్వే రాళ్లు సమకూర్చుకోవడం.. ఇలా ప్రతి అంశంలోనూ వేగం పెంచాల‌న్నారు. భూస‌మ‌గ్ర సర్వే కార్యక్రమాన్ని అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల‌ని ఆదేశించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa