ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైటి చెరువులో గుర్తు తెలియని మృత దేహం లభ్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 11, 2022, 12:47 PM

గుంతకల్లు మండలం వైటి. చెరువు గ్రామ చెరువులో సుమారు 50 నుండి 55 ఏళ్ల వయస్సు గల ఒక గుర్తు తెలియని పురుషుడి మృతదేహం శుక్రవారం సాయంత్రం గుర్తించినట్లు రూరల్ సిఐ బి. లక్ష్మన్న విలేకరులకు తెలిపారు. చెరువులో ఓ పురుషుడి మృత దేహం బోర్లా పడి ఉండినదని వైటి చెరువు సర్పంచ్ కు సమాచారం వచ్చిందన్నారు. వెంటనే సర్పంచ్ తమకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై శ్రీనివాసులు సిబ్బంది తో వెళ్లి మృతదేహాన్ని బయటకు తీయిం చాడని తెలిపారు. ఆ వ్యక్తి ఒంటిపై తెలుపు రంగు ఆఫ్ షర్టు, మెరూన్ ఎరుపు ఫుల్ డ్రాయరు ధరించి ఉన్నాడన్నారు. ఎత్తు సుమారు 5. 5 అడుగులు ఉన్నాడని తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాన్ని గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు. మృతుడి ఆనవాళ్లు గుర్తించిన వారు తమకు సమాచారం ఇవ్వాలన్నారు. రూరల్ ఎస్సై 9346917089, రూరల్ సిఐ9440796824 నంబర్లకు ఫోన్ చేసి తెలియజేయాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa