విద్యుత్ షాక్ తో బాలుడు మృతిచెందిన ఘటన జ్ఞానాపురం కూడలి వద్ద శనివారం ఉదయం చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించి కంచరపాలెం ఎస్ ఐ అప్పలనాయుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జ్ఞానాపురం జే. ఆర్. ఎన్. ఎం కోలని వద్ద నివాసముంటున్న ఇసరపు చైతన్య (9) స్థానికంగా సెంట్ పీటర్ పాఠశాలలో నాలుగవ తరగతి చదువుతున్నాడు. ఇదిలా ఉండగా శనివారం ఉదయం 11 గంటల సమయంలో బాలుడి ఇంట్లో ఉన్న కుక్క కిందకి వెళ్లిపోవడంతో కుక్కను మేడపైకి తెచ్చేందుకు ఇనుప చైన్ తోపాటు మేడ మెట్లు దిగుతున్నాడు.
ఈ క్రమంలో ఇనుప చైన్ సమీపంలో ఉన్న 11 కేవి విద్యుత్ వైర్ లకు తగలడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కంచరపాలం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించి బాలుడు తండ్రి నారాయణ ఫిర్యాదు మేరకు కంచరపాలెం సి. ఐ కృష్ణారావు నేతృత్వంలో ఎస్ ఐ అప్పలనాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa