వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై గళం ఎత్తుతున్న టీడీపీ నాయకత్వం తాజాగా జిల్లా పర్యటనలతో జనంలోకి దూసుకెళ్లాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ మళ్లీ సరికొత్త ప్రణాళికతో ముందుకెళ్తోంబది. ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు మళ్లీ జిల్లా పర్యటనలకు సిద్ధమయ్యారు. బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు ప్రారంభం అవుతున్నాయి. ఎన్టీఆర్ స్ఫూర్తి - చంద్రన్న భరోసా పేరుతో ఏడాది పాటు ఈ పర్యటనలు కొనసాగనున్నాయి. ఒక్కో టూర్లో మూడు రోజుల పాటు చంద్రబాబు జిల్లాలలో పర్యటించనున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, విధ్వంస పాలనపై ప్రజల భవిష్యత్ కు భరోసా ఇచ్చేలా అధినేత పర్యటనలు ఉండనున్నాయి.
టీడీపీ అధినేత చంద్రబాబు తన పుట్టిన రోజు నాటి నుంచే జిల్లాల పర్యటనలు మొదలు పెట్టారు. గత నెలలోనే బాదుడే, బాదుడు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత మహానాడు కార్యక్రమం ఉండటంతో కొద్దిరోజుల పాటూ పర్యటనలకు బ్రేక్ ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు పర్యటనలు ప్రారంభిస్తున్నారు. దాదాపు ఏడాది పాటూ ఈ పర్యటనలు కొనసాగనున్నాయి.. మొత్తం 80 నియోజకవర్గాలను కవర్ చేయాలని టీడీపీ అధినేత భావిస్తున్నారు.
ఎన్టీఆర్ శతజయంతి పై ఏడాది ఉత్సవాల నిర్వహణలో భాగంగా బుధవారం అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో తొలి జిల్లా మహానాడు జరుగుతుంది. ఈ పర్యటనలో మొదటి రోజు మహానాడు మహాసభ ఏర్పాటు చేస్తున్నారు. రెండో రోజు పార్లమెంట్లోని ఏడు నియోజకవర్గాల నేతలు, ముఖ్య కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం జరుగుతుంది. మూడో రోజు ప్రజా సమస్యలు, ప్రభుత్వ బాదుడే బాదుడు పై రోడ్ షోలు ఉంటాయి. ఏడాది పాటు 100 కి పైగా నియోజకవర్గాలు కవర్ అయ్యేలా చంద్రబాబు పర్యటనలు చెయ్యనున్నారు. నెలకు రెండు టూర్లు ఉండేలా ప్రణాళిక సిద్దం చేశారు. చంద్రబాబు జిల్లా పర్యటనల్లో ముందు అనకాపల్లి జిల్లాను ఎంచుకున్నారు.. కీలకమైన చోడవరం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa