ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ మెడకు పెగాసస్ వ్యవహారం...బాబుకు చిక్కులు తప్పవా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 15, 2022, 05:03 PM

దూకుడు ప్రదర్శిస్తున్న టీడీపీకి వైసీపీ నాయకత్వం బ్రేక్ వేసే చర్యలు మొదలెట్టిందా...? పెగాసస్ వ్యవహారంపై తాజాగా తెరపైకి రావడానికి ప్రధాన కారణం ఇదేనా అన్నకోణంలో రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. దేశాన్ని కుదిపేసిన పెగాసస్ వ్యవహారం టీడీపీకి తలనొప్పిగా మారింది. టీడీపీ హయాంలో చంద్రబాబు ఈ స్పై వేర్‌ను కొనుగోలు చేశారన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. రాష్ట్ర రాజకీయాల్లో పెగాసస్ స్పై వేర్ వివాదం కొద్దిరోజులు నడిచింది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలతో దుమారం రేగింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో పెగాసస్ స్పైవేర్ కొనుగోలు చేశారనడంతో ఆసక్తికర చర్చ జరిగింది. అనంతరం ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది.. మమత చేసిన వ్యాఖ్యల్ని సభలో ప్రస్తావించారు. పెగాసస్‌తో ఏం చేశారో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని మంత్రి బుగ్గన అన్నారు. పెగాసస్‌పై హౌస్‌కమిటీతో విచారణ జరపాలని కోరగా.. పెగాసస్‌పై హౌస్ కమిటీని నియమించాలని ఏకగ్రీవంగా అసెంబ్లీలో ఆమోదం తెలిపారు.


మరోవైపసు ఈ పెగాసస్ స్పైవేర్ ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేయలేదని.. గతంలో మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారని టీడీపీ ఇప్పటికే చెప్పింది. పెగాసస్ సాఫ్ట్ వేరును ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసిందా అంటూ ఓ ఆర్టీఐ దరఖాస్తుదారు అడిగిన ప్రశ్నకు.. లేదంటూ అప్పటి మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ సమాధానం ఇచ్చారంటోంది. ఇప్పుడు హౌస్ కమిటీ విచారణ చేపట్టడంతో చంద్రబాబుకు చిక్కులు తప్పవా అనే ప్రశ్న వినిపిస్తోంది.ఈ వ్యవహారంపై ఏపీ అసెంబ్లీ హౌస్ కమిటీ కూడా ఏర్పాటు చేయగా.. నేడు తొలి సమావేశం జరగనుంది. హోం తదితర శాఖల అధికారులతో సమావేశంకానున్నారు. ఈ వ్యవ‌హారంతో సంబంధం ఉన్న ప‌లు శాఖ‌ల అధికారుల‌ను విచారించాల‌ని నిర్ణయం తీసుకున్నారట. ఈ మేరకు ఆయా శాఖ‌ల‌కు క‌మిటీ లేఖలు రాసినట్లు సమాచారం.


ఇదిలావుంటే ఈ పెగాసెస్‌ వ్యవహారంపై అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారామ్ నియమించిన హౌస్‌ కమిటీకి చైర్మన్‌గా తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ఉన్నారు. ఈ కమిటీ సభ్యులుగా మంత్రులు అమర్నాథ్‌, మంత్రి మేరుగ నాగార్జున.. ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, అబ్బయ్య చౌదరి, కొలుసు పార్థసారథి,మద్దాల గిరిధర్‌లు ఉన్న సంగతి తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa