అక్రమణలో ఉన్న ప్రభుత్వభూమిలోని ప్రజలకు తరఫున పిటిషన్ దాఖలు చేసిన టీడీపీ ఎమ్మెల్యేపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆక్రమణలో ఉన్న అభ్యంతరంలేని ప్రభుత్వ భూములను క్రమబద్ధీకరించేందుకు 2017లో జారీచేసిన జీవో–388ని ప్రభుత్వం అమలుచేయడంలేదని ఎమ్మెల్యే పిల్ దాఖలు చేశారు. ఈ జీవో ప్రకారం భూములను క్రమబద్ధీకరించేందుకు లక్షల మంది పెట్టుకున్న దరఖాస్తులను అనుమతించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఈ పిల్పై ధర్మాసనం విచారణ జరిపింది.
బాధితులు కోర్టుకు రాకుండా మీరు (ఎమ్మెల్యే) ఎందుకొచ్చారని ప్రశ్నించింది. ప్రభుత్వ చర్యలు, ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే వాటిని అసెంబ్లీలో ప్రస్తావించాలని సూచించింది. అంతేకాదు ప్రతీ దాంట్లో పిల్ దాఖలు చేస్తామంటే కుదరదని తేల్చిచెప్పింది. ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ విషయంలో సర్కారు ఉత్తర్వులపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ ఆయన దాఖలు చేసిన పిల్ను ధర్మాసనం కొట్టేసింది.
2017లో జారీచేసిన జీవో ప్రకారం ఎంతోమంది తమ స్వాధీనంలో ఉన్న భూములను క్రమబద్ధీకరించుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారని.. ఇలాంటి వారు లక్షల్లో ఉన్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ జీవోను అమలుచేయకుండా.. ప్రభుత్వం కొత్త జీవో జారీచేసి భూములను క్రమబద్ధీకరిస్తోంది అన్నారు. దీనివల్ల గతంలో దరఖాస్తు చేసుకున్న వారి పరిస్థితి అయోమయంగా మారిందన్నారు.
ప్రభుత్వ చర్యలు ఇబ్బందిగా ఉంటే బాధితులు ఎందుకు కోర్టును ఆశ్రయించలేదని ధర్మాసనం ప్రశ్నించింది. బాధితులకు లేని ఇబ్బంది పిటిషనర్కు ఎందుకని.. ప్రతీ దానికి పిల్ దాఖలు చేయడం ఏంటని అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వ చర్యలు, ఉత్తర్వుల విషయంలో అభ్యంతరాలు ఉంటే బాధిత వ్యక్తులు కోర్టుకు వస్తారని.. వారికి లేని అభ్యంతరం మీకు ఎందుకని రామకృష్ణ బాబును హైకోర్టు ప్రశ్నించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa