ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ ఆరోపణలు రుజువు చేయండి...వంశీని అడ్డుకొన్న జనసేన కార్యకర్తలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 16, 2022, 01:52 PM

గత కొద్దిరోజులుగా జనసేన, వైసీపీ నేతల మాటల యుద్ధం జరుగుతోంది. తాజాగా వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ మండిపడుతోంది. స్ధానిక సంస్ధల ఎన్నికల సమయంలో వైఎస్సార్‌సీపీలోని కొందరు జనసేన నాయకులకు డబ్బులు ఇచ్చి వైసీపీ నాయకులను ఓడించేందుకు పనిచేశారని ఎమ్మెల్యే వంశీ చేసిన వ్యాఖ్యలతో వివాదం మొదలైంది. డబ్బులు తీసుకున్నట్లు రుజువు చేయాలని జనసేన నేత చలమలశెట్టి రమేష్ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పర్యటనకు వచ్చిన స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీని జనసేన పార్టీ నేతలు అడ్డుకున్నారు.


కృష్ణా జిల్లా బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అడ్డుకునేందుకు జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వెంటనే పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో జనసేన నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది.. దీంతో ఉద్రిక్తత వాతావరణం కనిపించింది. జనసేనపై ఎమ్మెల్యే వంశి చేసి వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. జనసేన నాయకులను అరెస్ట్ చేసి హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa