ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లక్ష్య సాధన దిశ మాత్రం చెదరనివ్వకూడదు: నాగబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 16, 2022, 01:53 PM

అనుకున్న లక్ష్య సాధన దిశ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చెదరనివ్వకూడదు జనసేన పార్టీ పి.ఏ.సీ. సభ్యులు కొణిదెల నాగబాబు అన్నారు. నేతలు, జనసైనికులు, వీర మహిళలు సాధ్యమైనంత వరకూ ప్రజల్లో ఉంటూ, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి అవి పరిష్కారం అయ్యేలా పని చెయ్యాలని ఆయన సూచించారు. ఆయన వివిధ జిల్లాల నుంచి వచ్చిన నాయకులు, జనసైనికులు, వీరమహిళలతో నాగబాబు మాట్లాడారు. స్థానికంగా, సామాజికంగా కొన్ని సమస్యలు నాగబాబు దృష్టికి తీసుకెళ్లారు. జనసైనికులుగా అందరం పార్టీ బలోపేతం కోసం, పార్టీ గెలుపు కోసం పని చేయాలని సూచించారు.


అనుకున్న లక్ష్య సాధన దిశ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చెదరనివ్వకూడదు అన్నారు. చాలా ఇబ్బందులను, అన్ని అవరోధాలను దాటుకొని ఈ స్థితికి వచ్చామని మున్ముందు ఇంకెన్ని ఇబ్బందులు ఎదురైనా అలసిపోని గుండె ధైర్యంతో పని చెయ్యాల్సిన బాధ్యత అందరికి ఉందన్నారు. పవన్ కళ్యాణ్ భావజాలం మన ఆయుధమని, జనసేన గెలుపు కోసం రానున్న ఎన్నికల సంగ్రామంపై దృష్టి పెట్టాలని దిశా నిర్దేశం చేశారు. పొత్తులు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక, కమిటీల నియామకం గురించి పవన్ కళ్యాణ్ చూసుకుంటారన్నారు.


ఈ అంశాలను ఏఏసీసభ్యులు, పార్టీలో వివిధ హోదాల్లో ఉన్న నాయకులతో, జిల్లా, రాష్ట్ర స్టాయి నేతలతో చర్చించి మనందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ప్రతీ నియోజకవర్గంలో, ప్రతీ పోలింగ్‌ కేంద్రాల్లో, ప్రతీ బ్యాలెట్‌ బాక్సులో జనసేనకు ఓటు వేయిందాల్సిన బాధ్యతను జనసైనికులుగా మనం తీసుకోవాలని సూచించారు. స్టానికంగా ఎక్కడికక్కడ ప్రజా సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారం కోసం పని చేసి తద్వారా వారి అభినందనలు ఓటు రూపంలో బ్యాలెట్‌ బాక్సులో వేయించుకోగలగాలని చెప్పారు. జనసేన పార్టీకి రాజ్యాధికారం కట్టబెట్టాల్సిన ఆవశ్యకతను ప్రజలకు వివరించాలన్నారు నాగబాబు. పవన్‌ కళ్యాణ్‌ ముఖ్యమంత్రి అయితే పరిపాలనలో చోటు చేసుకునే విప్లవాత్మకమైన మార్పులను ప్రతీ పౌరుడికి విడమరచి తెలియజేయాలని స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa