ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వర్షాలకు ఆ ప్రాంతాలు అతలాకుతలం

national |  Suryaa Desk  | Published : Fri, Jun 17, 2022, 02:54 AM

భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో ఓ జాతీయ రహదారి ధ్వంసమైంది. అసోం, మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్‌‌‌ల్లోని పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్నాయి. చాలా ప్రదేశాలు జలమయం అయ్యాయి. దాంతో పలు చోట్ల కొండచరియలు కూడా విరిగిపడ్డాయి. ఈ క్రమంలో మేఘాలయలోని లుమ్ష్‌నాంగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి 6(ఎన్ హెచ్ 06) కొంత ధ్వంసమైంది. దీనివల్ల ఒక లారీ, కారు ఒక గుంతలో కూరుకుపోయాయి. దాంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. హైవే వెంబడి పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.


దీంతో ప్రజలు ఆ మార్గంలో వెళ్లవద్దని జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ అధికారులు సూచించారు. "ఆ రహదారి మార్గాన్ని క్లియర్ చేయడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. ఒంటరిగా ఉన్న ప్రయాణికులకు అవసరమైన సహాయం చేస్తున్నాం." అని వారు తెలిపారు. ఈ సందర్భంగా మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా మీడియాతో మాట్లాడారు. "గత రాత్రి నుంచి కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా మేఘాలయలోని వివిధ ప్రాంతాల్లో ముఖ్యంగా తూర్పు జైంతియా హిల్స్ జిల్లాలోని కొన్ని ఇంప్ రోడ్ కనెక్షన్‌లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దానిపై వివిధ జిల్లాల డీ కమిషనర్లు, మంత్రులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించాను." అని చెప్పారు. ఈ మేరకు పలు ప్రాంతాల్లో పరిస్థితిపై సమీక్షించారు.


సమావేశం అనంతరం జిల్లాలో రానున్న 24 నుంచి 48 గంటల్లో పరిస్థితిని పరిశీలించేందుకు, వాహనాల రాకపోకలను సులభతరం చేసేందుకు చర్యలు చేపట్టేందుకు సంబంధిత మంత్రుల నేతృత్వంలో నాలుగు ప్రాంతీయ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు సీఎం సంగ్మా తెలిపారు. మరోవైపు ఓ భారీ లారీ రోడ్డు మధ్యలో కూరుకుపోయిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కాగా భారత వాతావరణ శాఖ ప్రకారం 24 గంటల్లో చిరపుంజిలో 811.6 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. ఇది 1995 తర్వాత జూన్‌లో నమోదైన వర్షపాతం కంటే ఇది చాలా అత్యధికం. ఇదిలావుంటే ఈ ఏడాది ఈశాన్య రాష్ట్రంలో వర్షాలు కురిశాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa