తన చావుకు కారణమైన విషయాలను రాసి హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకొన్నాడు. దాని ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారు. విధినిర్వహణలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ సర్వీస్ తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. కుటుంబ సమస్యలు, వర్క్ టెన్షన్ తో ట్రెజరీలో విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడని వెలుగు చూడటంతో సాటి పోలీసులు సైతం హడలిపోవడం హాట్ టాపిక్ అయ్యింది.
కర్ణాటకలోని గదగ్ లో కిరణ్ కుమార్ (45) హెడ్ కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్నాడు. గదగ్ జిల్లా ట్రెజరీ కార్యాలయంలో కిరణ్ కుమార్ విధులు నిర్వహిస్తున్నాడు. ఎప్పటిలాగే కిరణ్ కుమార్ విధులకు హాజరౌతున్నాడు. ట్రెజరీ దగ్గర కాపలా ఉండటానికి పోలీసు శాఖ కిరణ్ కుమార్ చేతికి 303 తుపాకి ఇచ్చింది. బుధవారం కిరణ్ కుమార్ గదగ్ జిల్లా ట్రెజరీ కార్యాలయంలో విధులకు వెళ్లాడు. రాత్రి 8 గంటల సమయంలో కిరణ్ కుమార్ అక్కడ డ్యూటీ చేస్తున్న విషయం ట్రెజరీ సిబ్బంది చూశారు. తరువాత కిరణ్ కుమార్ ను విధుల నుంచి రిలీవ్ చేసి డ్యూటీలో జాయిన్ కావడానికి సాటి పోలీసు గదగ్ జిల్లా ట్రెజరీ కార్యాలయంలోకి వెళ్లాడు.
ఆ సందర్బంలో జిల్లా ట్రెజరీ కార్యాలయం తలుపులు మొత్తం లోపల నుంచి మూసివేసి ఉండటం, కిరణ్ కుమార్ కనపడకపోవడంతో సాటి పోలీసు పై అధికారుకు సమాచారం ఇచ్చారు. పోలీసు అధికారులు వెళ్లి ట్రెజరీ తలుపులు పగలగొట్టి చూడగా కిరణ్ కుమార్ అతని సర్వీసు తుపాకితో గొంతులో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని వెలుగు చూసింది.
కుటుంబ సమస్యలు, వర్క్ టెన్షన్ తో ట్రెజరీలో విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడని వెలుగు చూడటంతో సాటి పోలీసులు సైతం హడలిపోవడం హాట్ టాపిక్ అయ్యింది. హెడ్ కానిస్టేబుల్ కిరణ్ కుమార్ ఆత్మహత్య చేసుకునే సమయంలో డెత్ నోట్ రాశాడని, డెత్ నోట్ ఆధారంగా కేసు విచారణ చేస్తున్నామని సాటి పోలీసులు అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa