ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎపుడు నిరసనలు జరిగిన..రైల్వేశాఖనే నష్టపోతోందటా

national |  Suryaa Desk  | Published : Fri, Jun 17, 2022, 10:57 PM

దేశవ్యాప్తంగా రైళ్ల దహనాల ఘటనలు పెరుగుతున్నాయి. గత రెండు రోజులుగా బీహార్, యూపీతో పాటు తెలంగాణ వంటి రాష్ట్రాల్లోనూ రైళ్ల దహనాల ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో రైల్వే శాఖ అప్రమత్తమవుతోంది. మిగతా రైల్వే స్టేషన్లలోనూ భద్రత పెంచుతోంది. ఇప్పటికే చోటు చేసుకున్న ఘటనలపై విచారణ జరుపుతోంది. కట్టుదిట్టమైన భద్రత ఉంటే రైల్వేస్టేషన్లలో ఆందోళనకారులు చాలా సులువుగా చొచ్చుకుని వచ్చి రైళ్లను తగులబెడుతున్న వైనం రైల్వేశాఖకు ఇబ్బందికరంగా మారిపోతోంది. దీంతో ఈ ఘటనల వెనుక నిర్దిష్ట కారణాలు తెలుసుకునే పనిలో రైల్వే వర్గాలు నిమగ్నమై ఉన్నాయి.


ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకూ చూస్తే పలు రైళ్లు దహనమయ్యాయి. ఈ వరుస రైళ్ల దహనాల వెనుక పెరుగుతున్న నిరుద్యోగం ఓ బలమైన కారణంగా కనిపిస్తోంది. ముఖ్యంగా దేశంలో కోవిడ్ తర్వాత పెరిగిన నిరుద్యోగిత యువతను కలవరపెడుతోంది. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గతంలోలా ఉద్యోగాలు ఇచ్చే పరిస్ధితుల్లో లేవు. దీంతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం యువత తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. స్ధిరత్వం లేని ప్రైవేటు ఉద్యోగాల కంటే ప్రభుత్వ ఉద్యోగాలే నయమని వాటి కోసం ఎదురుచూస్తుంటే ప్రభుత్వాలు నిరుద్యోగుల్ని నిరాశ పరుస్తున్నాయి. దీంతో వారిలో పెరుగుతున్న అసహనమే రైళ్ల దహనాలకు కారణమవుతున్నట్లు తెలుస్తోంది.


దేశవ్యాప్తంగా గత రెండు రోజులుగా కేంద్రం తీసుకొస్తున్న అగ్నిపథ్ ఆర్మీ రిక్రూట్ మెంట్ పథకాన్ని నిరసిస్తూ నిరుద్యోగులు రోడ్డెక్కుతున్నారు. ఉద్యోగల భద్రత ఉంటుందని భావించే కేంద్ర ప్రభుత్వాల ఉద్యోగాలే కాంట్రాక్టు ఉద్యోగాల్లో తాత్కాలికంగా మారిపోతున్న వేళ నిరుద్యోగుల్లో ఆగ్రహం పెరుగుతోంది. దాని ఫలితంగా ఏకంగా కేసుల్ని కూడా లెక్కచేయకుండా రైళ్ల దహనాలు యథేచ్ఛగా జరిగిపోతున్నాయి. దీంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa