తమ పార్టీలో బలమైనే నేతలకు గాళం వేసేందుకే టీడీపీ నేతలపై ఈడీ అస్త్రాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విసురుతోందన్న విమర్శలు రాజకీయ వర్గాల్లో వినవస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలో ఉన్న పారిశ్రామికవేత్తలతోపాటు బలమైన నేతలుగా ఉన్నవారందరిపై బీజేపీ దృష్టిసారించిందని భావిస్తున్నారు. రాష్ట్ర బీజేపీ నేతలు ఇచ్చిన సూచనల మేరకు ఎవరెవరు పార్టీలోకి వస్తే బాగుంటుందో ఆలోచించుకొని వారందరితో సునీల్ దేవధర్ మాట్లాడుతున్నారు. ఎవరెవరితో మాట్లాడారన్నది పూర్తిగా తెలియనప్పటికీ చాలామంది నిరాకరించినట్లు తెలుస్తోంది.
కోస్తాకు చెందిన ఒక బలమైన తెలుగుదేశం పార్టీ నేతతో కూడా మాట్లాడారని, ఆయన ఎటువంటి సమాధానం ఇవ్వలేదని సమాచారం. నిరాకరించినంతమాత్రాన ఈడీతో, సీబీఐతో వేధింపులకు పాల్పడటం మాత్రం సరైన రాజకీయం అనిపించుకోదంటూ బీజేపీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు జేసీ సోదరులపై దాడులు జరిగాయి.. రేపు ఎవరి నివాసంలోనే, కార్యాలయంలోనే మళ్లీ ఈడీ దాడులు జరుగుతాయో.. ఆ నేతలతో బీజేపీ నేతలు మాట్లాడినట్లుగా అర్థం చేసుకోవాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa