పథకాల అమలు పెను భారంగా మారడంతో ఏపీ సర్కార్ ఆర్థిక భారాన్ని తగ్గించుకొనే ప్రయత్నం మొదలెట్టింది. ఏపీలో వైఎస్సార్ భరోసా కింద ఇస్తున్న సామాజిక పెన్షన్ల నిబంధనల్ని వైసీపీ సర్కార్ మరోసారి సవరించింది. దీని ప్రకారం ఇకపై కొన్ని వర్గాల వారికి ఇకపై గతంలోలా 35 ఏళ్లకు పింఛన్ ఇచ్చే కార్యక్రమానికి మంగళం పలికింది. దీని స్ధానంలో ఇకపై 50 ఏళ్లు దాటాకే పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో లక్షల మంది పెన్షన్ దారులపై ఈ ప్రభావం పడబోతోంది. త్వరలో ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
పెన్షన్ నిబంధనల్లో మార్పు ఏపీలో వివిధ వర్గాలకు ప్రభుత్వం ఇస్తున్ను సామాజిక పెన్షన్లలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా గతంలో పెన్షన్ ఇచ్చేందుకు ఉన్న వయోపరిమితుల్ని మారుస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. దీని వల్ల లక్షలాది మంది మహిళలపై ఈ ప్రభావం పడబోతోంది. ఈ మేరకు పెన్షన్ అర్హతల్ని సవరిస్తూ కొత్త విధానాన్ని ప్రభుత్వం అమలు చేయబోతోంది. ఆరునెలలకోసారి ఇస్తున్న పెన్షన్లలో ఈ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. దీంతో ఆరునెలల తర్వాత ఈ కేటగిరీల్లో పెన్షన్ లబ్దిదారుల సంఖ్యలో భారీగా కోతలు ఖాయంగా కనిపిస్తున్నాయి. 50 ఏళ్లకే ఒంటరి మహిళల పెన్షన్ రాష్ట్రంలో ప్రస్తుతం వైసీపీ సర్కార్ 35 ఏళ్లకే భర్తల్ని వదిలేసిన ఒంటరి మహిళలకు పెన్షన్ ఇస్తోంది. అయితే ఈ నిబంధనను మార్చి ఇకపై 50 ఏళ్లు దాటిన వారికే పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతే కాదు భర్తను వదిలేసిన ఏడాది తర్వాత మాత్రమే పెన్షన్ కు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. అలాగే సదరు మహిళ ఒంటరిగా ఉంటున్నట్లు ధృవీకరణ పత్రాన్ని కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు పంచాయతీ రాజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అవివాహితలకూ 50 ఏళ్లకే ఇప్పటివరకూ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో అవివాహితలకు 35 ఏళ్ల నుంచి పెన్షన్ అమలు చేస్తున్నారు. నెలకు రెండున్నర వేల చొప్పున ఆరునెలలకు కలిపి ఒకేసారి వీరికి పెన్షన్ అందిస్తున్నారు. ఇకపై వీరికి కూడా 50 ఏళ్ల తర్వాతే పెన్షన్ ఇస్తామని ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో ప్రకటించింది. అలాగే అవివాహిత మహిళలకు కుటుంబం నుంచి ఎలాంటి సాయం అందడం లేదని ధృవపత్రం సమర్పించాల్సి ఉంటుంది. దీంతో పాటు పెళ్లి కాలేదనే ధృవపత్రాన్ని కూడా ఎమ్మార్వో నుంచి తీసుకుని ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనలు మాత్రం కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే వర్తింపచేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa