రైతు వ్యతిరేక చట్టాలు, తాజాగా అగ్నిపథ్ తో ఉత్తరాదిన బీజేపీపై తీవ్ర వ్యతిరేకత పెరుగుతోంది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో ఉత్తరాదిలో పార్టీకి కొంత నష్టం తప్పదు అని భావిస్తున్న బీజేపీ ఆ లోటును దక్షిణాదిలో పూడ్చుకోవాలని భావిస్తోంది.
ఈసారి ఎన్నికలకు లోక్సభ స్థానాలు ఉత్తరాదివైపు తగ్గినా దక్షిణాదిలో పెంచుకోవాలనే ఉద్దేశంలో ఆ పార్టీ నేతలున్నారు. గత ఎన్నికల్లో తెలంగాణలో నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకోగలిగింది. గట్టిగా కృషిచేస్తే ఎనిమిదికి తగ్గకుండా ఈసారి గెలుచుకోవాలనే యోచనలో ఆ పార్టీ నేతలున్నారు. తమిళనాడు నుంచి అన్నాడీఎంకే మద్దతు ఉంటుంది. కర్ణాటకలో కాంగ్రెస్ను ఢీకొట్టి మెజారిటీ ఎంపీ సీట్లు గెలుచుకోగలమనే నమ్మకంతో ఉంది. ఏతావతా బీజేపీకి కలిగే నష్టం కేరళ. ఆ రాష్ట్రం నుంచి ఒక్క ఎంపీ సీటు కూడా గెలవగలిగే పరిస్థితి లేదు. కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ సమైక్యంగా ఎన్నికలకు వెళితే బీజేపీకి ఆ సీట్లు కూడా కష్టమే.
ఇదిలావుంటే ఏపీలో వైసీపీ అవసరాల దృష్ట్యా లోపాయికారీగా బీజేపీకి మద్దతిస్తోంది. తెలుగుదేశం కూడా బీజేపీవైపే చూస్తోంది. ఒకవేళ పొత్తు కుదిరితే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీచేస్తాయి. బీజేపీకి ఇష్టం లేకపోతే తెలుగుదేశం, జనసేన కలిసి పోటీచేసే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మాత్రం బీజేపీ రొట్టె విరిగి నేతిలో పడ్డట్లే. అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి అవకాశం వస్తే బాగుంటుంది కదా అనే అత్యాశ మాత్రం ఆ పార్టీ రాష్ట్ర నేతల్లో వ్యక్తమవుతోంది.!!
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa