బీసీలకు సీఎం వైఎస్ జగన్ మేలు చేసినట్లు ఎవరూ చేయలేదని. బీసీలను చంద్రబాబు ఓట్లు వేసే యంత్రాల్లా మార్చారని ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విమర్శించారు. టీడీపీ నేతలు కబ్జాలు చేస్తుంటే , మర్డర్లు చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. అయ్యన్న పాత్రుడు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఉత్తరాంధ్ర పర్యటనలో చంద్రబాబు పిచ్చిపట్టినట్లు మాట్లాడారని.. చంద్రబాబుకు, టీడీపీ నేతలకు, కార్యకర్తలకు.. లోకేష్ పప్పు అని అర్థమైందన్నారు.
తప్పు చేసిన వ్యక్తి బీసీ అయితే వదిలేయాలా అని మంత్రి ప్రశ్నించారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు భూమి ఆక్రమించి ఇల్లు కట్టారని.. ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. బుద్దా వెంకన్న కాల్ మనీ వేధింపుల గురించి అందరికీ తెలుసని, ఆయనకు మాట్లాడే అర్హత లేదన్నారు. టీడీపీలో మహిళలకు గౌరవం లేదని అందుకే ఒక్కొక్కరూ టీడీపీని వీడుతున్నారన్నారు. ఆడవాళ్లను గౌరవించే సంస్కారం టీడీపీకి ఉందా అని ప్రశ్నించారు. వనజాక్షి దగ్గర నుంచి రిషితేశ్వరి వరకు మహిళలను వేధించారన్నారు.
తాను ఉంటే కరోనా రాదని, ఉక్రెయిన్ లో ఉన్న తెలుగు విద్యార్థులకు అభినందనలు, తుఫాన్లను ఆపుతా అనడం చూస్తుంటే.. చంద్రబాబు మెంటల్ స్టెబిలిటీని తెలయజేస్తోంది అన్నారు. 2019లో 151 గెలిచాం.. 2024లో 175 గెలుస్తామని ధీమాను వ్యక్తం చేశారు. దీనిని తట్టుకోలేక చంద్రబాబు మాట్లాడుతున్నారని.. వైఎస్ జగన్ పాలన చూసి చంద్రబాబు తట్టుకోలేక పోతున్నారు.. ఆ ఈర్ష్యతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు దమ్మూ ధైర్యం ఉంటే సింగిల్గా రావాలని సవాల్ విసిరారు. చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనలో జనాలు జై జగన్ అంటున్నారన్నారు.
అయ్యన్నపాత్రుడు తప్పు చేస్తే చూస్తూ ఊరుకోవాలా.?, మహిళలు, ఎస్సీల గురించి దారుణమైన వ్యాఖ్యలు చేశారని నాగేశ్వరరావు అన్నారు. గతంలో బాలకృష్ణ మహిళల గురించి ఎంతటి దారుణమైన వ్యాఖ్యలు చేశారో చూశామని.. విజయవాడలో మహిళలతో కాల్ మనీ సెక్స్ రాకెట్ నడిపిన చరిత్ర బుద్దా వెంకన్నది అంటూ విమర్శలు చేశారు. చంద్రబాబు విజయవాడలో ఎన్ని గుడులు కూల్చారో అందరూ చూశారని.. అలాగే షూటింగ్ పిచ్చితో పుష్కరాల్లో జనాన్ని చంపారని విమర్శించారు. జగన్ పై పోరాటానికి టీడీపీ వారే రావటం లేదని.. ఇక ఇంటికొకరు ఏం వస్తారని ఎద్దేశా చేశారు.కేంద్రంపై పోరాటం చేయలేక జగన్ని టార్గెట్ చేశారని మండిపడ్డారు.
చంద్రబాబు అసలు ఏ పార్టీ నుంచి వచ్చారు.. టీడీపీలోకి వెళ్లి ఆ పార్టీని, ఆ పార్టీ బ్యాంక్ బ్యాలెన్స్ను కబ్జా చేసిన వ్యక్తి అన్నారు మంత్రి. చంద్రబాబు తరహాలోనే అయ్యన్న పాత్రుడు నడుస్తున్నారని.. తప్పు చేసి కూడా దాన్ని బీసీలపై రుద్దటం ఏంటని ప్రశ్నించారు. బీసీలు సెక్రటేరియట్ లోకి వస్తే తోక కట్ చేస్తానన్న వ్యక్తి చంద్రబాబు.. అలాంటి వ్యక్తి బీసీలకు ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa