కబ్జాలో ఉన్న గోడను తొలగించడం రాజకీయ కుట్ర అనడం హోంమంత్రి సరికాదని మంత్రి తానేటి వనిత అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్షాలు కుల ప్రస్తావన తీసుకువస్తున్నాయని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఎస్సీ ,ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇంటి గోడ కూల్చివేతపై రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు మంత్రి తానేటి వనిత ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. అయ్యన్న పాత్రుడు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారని.. దాన్ని గుర్తించిన అధికారులు చర్యలు తీసుకున్నారని చెప్పారు. కబ్జా స్థలంలో కూల్చివేతలకు సంబంధించి 15 రోజులకు ముందే అయ్యన్నకు నోటీసులు ఇచ్చారని తెలిపారు.
అయితే, ఘటనా స్థలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు మాత్రమే పోలీసులు అక్కడికి వచ్చారని మంత్రి తానేటి వనిత చెప్పారు. ఇక, ప్రభుత్వంపై అయ్యన్నపాత్రుడు భార్య చేసిన కామెంట్స్కు హోంమంత్రి వనిత కౌంటర్ ఇచ్చారు. మహిళలను, దళితులను తన భర్త కించపరిచినట్టు మాట్లాడినప్పుడు ఆయన భార్య మాట్లాడలేదని.. ఇప్పుడు మాత్రం బయటకు వచ్చి రాజకీయ కుట్ర అని ఆరోపించడం దారుణమన్నారు.
తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ నాయకులు కలిసి తమ అధినేతపై కేసులు పెట్టడాన్ని రాజకీయ కుట్ర అంటారని హోం మంత్రి తానేటి వనిత అన్నారు. తమ నాయకుడు ప్రతిపక్షంలో ఉండగా విశాఖపట్నం ఎయిర్పోర్టులో నిర్బంధించడాన్ని రాజకీయ కుట్ర అంటారని తెలిపారు. తాము ఎప్పుడూ అలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదన్నారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఈ రకంగా కబ్జాలు చేయటమే సరికాదని చెబుతున్నామని పేర్కొన్నారు. అయ్యన్నపాత్రుడు చేసిన తప్పును ఒప్పుకోవడం మంచిదని హితవుపలికారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa