టీటీడీ ముందు తాజాగా ఓ భక్తుడు కొత్త ప్రతిపాదన తీసుకొచ్చాడు. డిస్పోజబుల్ సేవింగ్ రేజర్స్తో కేశఖండన చేసేలా చర్యలు తీసుకోవాలని ఆ భక్తుడు విన్నవించుకొన్నాడు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం వేలాదిమంది భక్తులు తిరుమలకు వస్తారు. అలాగే స్వామివారికి తలనీలాలు సమర్పించుకుంటారు. అయితే, తలనీలాలు సమర్పించేటప్పుడు కేశఖండన చేసే నాయీబ్రాహ్మణులు వాడే కత్తి విషయంలో ఓ సామాజిక కార్యకర్త టీటీడీకి ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. ప్రస్తుతం తిరుమలలోని కళ్యాణకట్టల్లో నాయీబ్రాహ్మణులు వాడే కత్తికి బదులు డిస్పోజబుల్ సేవింగ్ రేజర్స్తో కేశఖండన చేయాలని ఆ సామాజిక కార్యకర్త అంటున్నారు. దీని వల్ల భక్తులకు ఎలాంటి హాని కలగకపోగా చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయని ఆయన చెబుతున్నారు.
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన సామాజిక కార్యకర్త తోట శ్రీనివాస్ ఈ ప్రతిపాదనను తీసుకొచ్చారు. తిరుమలలో రోజూ 70 నుంచి 80 వేల మందికి కేశఖండన చేస్తున్నారని.. అయితే, నాయీబ్రాహ్మణులు బ్లేడు మారుస్తున్నారు కానీ, కత్తిని మాత్రం స్టెరిలైజ్ చేయడం కానీ, డెటాల్తో క్లీన్ చేయడం కానీ చేయడం లేదని శ్రీనివాస్ అంటున్నారు. దీని వల్ల ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉందంటున్నారు. తిరుమలలో ఒక్కో నాయీబ్రాహ్మణుడు ఒక్కరోజులో ఒక్క కత్తితో 800 నుంచి 900 మందికి కేశఖండన చేస్తున్నారని, ఇది ప్రమాదకరమని చెబుతున్నారు. భక్తుల అభిప్రాయాలను సేకరించి డిస్పోజబుల్ సేవింగ్ రేజర్ను ప్రవేశపెట్టాలని టీటీడీని శ్రీనివాస్ కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa