ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముగిసిన ప్రచారం...23న ఆత్మకూరులో పోలింగ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 21, 2022, 02:02 AM

నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు అసెంబ్లీ స్థానానికి జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నికకు పోలింగ్ ఈ నెల 23న జరగనున్నది. ఏపీ దివంగ‌త మంత్రి మేకపాటి గౌత‌మ్ రెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణం నేప‌థ్యంలో నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు అసెంబ్లీ స్థానానికి జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. ఇదిలావుంటే ఈ ఉప ఎన్నికల ప్ర‌చారం మంగ‌ళ‌వారం సాయంత్రానికి ముగియ‌నుంది. ఈ నెల 23న ఉప ఎన్నిక పోలింగ్ జ‌ర‌గ‌నుంది. పోలింగ్‌కు ఓ రోజు ముందుగానే ప్ర‌చారం ముగియాల్సి ఉన్న నేప‌థ్యంలో ఏపీ ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి ముఖేశ్ కుమార్ మీనా సోమ‌వారం సాయంత్రం ఉప ఎన్నిక‌కు సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఆత్మ‌కూరు ఉప ఎన్నిక పోలింగ్‌కు సంబంధించి ఇప్ప‌టికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మీనా పేర్కొన్నారు. 123 పోలింగ్ కేంద్రాల‌ను స‌మ‌స్యాత్మ‌క‌మైన‌విగా గుర్తించామ‌న్న మీనా... ఎన్నిక‌ల‌కు మూడంచెల భ‌ద్ర‌త క‌ల్పించామ‌ని తెలిపారు. పోలింగ్‌ను వెబ్ క్యాస్టింగ్ ద్వారా ప‌ర్య‌వేక్షిస్తామ‌ని, ఓట‌ర్లు నిర్భ‌యంగా ఓటేయాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. అక్ర‌మాల‌పై సీ విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయ‌వ‌చ్చ‌ని ఆయ‌న సూచించారు.ఎన్నిక‌ల నియమావ‌ళి ప్ర‌కారం మంగ‌ళవారం సాయంత్రానికే ప్ర‌చారాన్ని ముగించాల‌ని ఆయ‌న అన్ని రాజ‌కీయ పార్టీల‌కు సూచించారు. ఈ నిబంధ‌న‌ను అతిక్ర‌మించే పార్టీల‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. నియోజ‌క‌వ‌ర్గ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 279 పోలింగ్ కేంద్రాల్లో వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసిన‌ట్లు వెల్ల‌డించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa