ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పాలనలో పేద ప్రజల పై పెంచిన ధరల భారాన్ని వారు భరించలేక విలవిల్లాడుతున్నారు అని చదలవాడ అరవింద్ బాబు తెలిపారు. పల్నాడు జిల్లా, నరసరావుపేట మండలం గురవాయపాలెం గ్రామంలో గ్రామ టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని, గ్రామంలో గడప గడపకు వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నాను. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు అవుతున్న ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తుంది, ప్రశ్నించిన వారి మీద పోలీస్ కేసులు బనాయించడం చేసి భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. కానీ రాబోయే రోజుల్లో ప్రజలు తప్పకుండ టీడీపీ పార్టీకి పట్టం కడతారు , అందరికి న్యాయం చేసే భాద్యత నాది అని హామీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa