ఉత్తరాంధ్రలో టీడీపీకి పూర్వ వైభవం రావడంతో బీసీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఎదుగుదలను అడ్డుకోవాలనే దురాలోచనతోనే వైసీపీ ప్రభుత్వం ఇలా చేస్తుంది అని నరసరావుపేట టీడీపీ ఇంచార్జి చదలవాడ అరవింద్ బాబు తెలియజేసారు. అయ్యన్నపాత్రుడు ఇంటి కూల్చివేతపై స్పందించిన అయన మాట్లాడుతూ..... ఆయన పై పోలీసులు అన్యాయంగా ఎన్నో అక్రమ కేసులు పెట్టారు అయినప్పటికీ అయ్యన్న భయపడకపోవడంతో అక్కసుతోనే కూల్చివేతలకు దిగారు. ఇంట్లో అయ్యన్న సతీమణి మాత్రమే ఉన్న సమయంలో ప్రభుత్వం, అధికారులు, పోలీసులు కుమ్మక్కై ఇంటి గోడను కూల్చేయడం అన్యాయం. ప్రజాస్వామ్యం సమాజంలో ఎటువంటి అరాచక పోకడలు సరికాదు. టీడీపీకి ప్రజల్లో ఆదరణ పెరగడం,వైసీపీ పై ప్రజలు తిరుగుబాటు చేస్తుండడంతో అక్కసుతోనే ఇలా ప్రవర్తిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే వైసిపి చర్యలకు వడ్డీతో సహా చెల్లిస్తాం అని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa