చిన్న దేవాలయాలపై ఏపీ సర్కార్ కరుణ చూపింది. దేవదాయ శాఖ చట్టం ప్రకారం రాష్ట్రంలో రూ.రెండులక్షలకు పైగా ఆదాయం ఉన్న ఆలయాలు ఏటా కొంత మొత్తం దేవదాయ శాఖకు చెల్లించాలి. కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్)కు ప్రతి ఆలయం తమ నికర ఆదాయంలో తొమ్మిది శాతం చొప్పున చెల్లించాలి. దేవదాయ శాఖ నిర్వహణ నిధికి మరో ఎనిమిది శాతం మిగిలిన 1.5 శాతం ఆడిట్ ఫీజుగా చెల్లించాలి. మొన్నటి వరకు ఈ నిబంధన అమల్లో ఉంది. ఇటీవల హైకోర్టు ఇటీవల రూ.ఐదులక్షల లోపు ఆదాయం ఉండే ఆలయాలను ఈ ఫీజుల నుంచి మినహాయించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. హైకోర్టు సూచనపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.
జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. చిన్న ఆలయాలను అర్చకులకు అప్పగించే అంశంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఆదాయం తక్కువ ఉండే ఆలయాలపై అదనపు భారాలు పడకుండా కీలక ముందడుగు వేసింది. రూ.ఐదులక్షల లోపు ఆదాయం ఉండే ఆలయాలు, ఇతర హిందూ ధార్మికసంస్థలు చట్టబద్ధంగా దేవదాయ శాఖకు చెల్లించాల్సిన ఫీజుల నుంచి మినహాయింపు ఇచ్చింది. దేవదాయ శాఖ కమిషనర్ హరిజవహర్లాల్ దీనికి సంబంధించి జిల్లాల దేవదాయ శాఖ అధికారులకు, డిప్యూటీ కమిషనర్లు, రీజనల్ జాయింట్ కమిషనర్లకు సూచనలు చేశారు. అధికారిక ఉత్తర్వులు రావాల్సి ఉండగా.. కమిషనర్ ముందుగానే ఆలయాల నుంచి ఫీజులను వసూలు చేయొద్దని ఆదేశించారు.
ఆదాయం రూ.5 లక్షల లోపు కలిగిన ఆలయాలు 7 వేలకు పైగా ఉన్నాయని జిల్లాల అధికారులు చెబుతున్నారు. వాటిలో సుమారు 3 వేల ఆలయాలు ఇప్పటికే అర్చకులు లేదా అనువంశిక ధర్మకర్తల చేతుల్లో ఉన్నాయి. అంతేకాదు రూ.ఐదులక్షల లోపు ఆదాయం ఉండే ఆలయాలను దేవదాయ శాఖ చట్టబద్ధంగా చెల్లించాల్సిన ఫీజుల నుంచి మినహాయింపు ఇస్తూ తీసుకున్న నిర్ణయంతో ఆయా ఆలయాల్లో పనిచేసే అర్చకుల జీతాలకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని అర్చక సమాఖ్య చెబుతోంది. ప్రభుత్వానికి అర్చక సమాఖ్య ప్రధాన కార్యదర్శి కృతజ్ఞతలు తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa