ప్రభుత్వం బంగారంపై ప్రాథమిక దిగుమతి పన్నును 7.5 శాతం నుంచి 12.5 శాతానికి పెంచింది. రూపాయి రికార్డు కనిష్ట స్థాయికి పడిపోవడంతో దిగుమతులను అరికట్టేందుకు ఈ చర్య తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.కోవిడ్ తర్వాత బంగారం డిమాండ్ పెరగడంతో..భారత్ 10 ఏళ్లలో దిగుమతి చేసుకున్న దానికంటే గత ఏడాదిలోనే అత్యధికంగా దిగుమతి చేసుకుంది. ఇదిలా ఉండగా బంగారం అక్రమ రవాణాను తగ్గించేందుకు.. బంగారంపై దిగుమతి సుంకాన్ని 7.5 శాతం నుంచి 4 శాతానికి తగ్గించాలని దేశంలోని ప్రముఖ ఆభరణాల వ్యాపారులు ఈ ఏడాది ప్రారంభంలో ప్రభుత్వాన్ని కోరారు. దీనికి విరుద్ధంగా ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని 5 శాతం మేర పెంచింది. బంగారంపై దిగుమతి సుంకం పెరగడంతో ఈ భారం రిటైల్ కొనుగోలు దారులపై పడుతుంది. దీంతో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. మరో ప్రక్క దేశీయ మార్కెట్ను బలోపేతం చేసేందుకు చైనా, అమెరికా, సింగపూర్ వంటి దేశాలు బంగారంపై దిగుమతి సుంకాన్ని తొలగించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa